‘మన్మథుడు’ సినిమాను తలుచుకుంటే అక్కినేని నాగార్జున అభిమానులకు ఒక పులకింత కలుగుతుంది. ఆ సినిమా వచ్చి రెండు దశాబ్దాలవుతున్నప్పటికీ.. ఇప్పుడు చూసినా ఆద్యంతం అలరించే చిత్రమది. నాగ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనొచ్చు ‘మన్మథుడు’ను. ఈ సినిమా ఫలానా హీరో మాత్రమే చేయగలడు, ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేం అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. నాగ్ కెరీర్లో ‘మన్మథుడు’ అలాంటి చిత్రాల్లో ఒకటి. అంతగా ఆకట్టుకున్న ఆ చిత్రానికి 17 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించాడు.
కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం.. దారుణమైన ఫలితాన్నందుకుంది. ‘చి ల సౌ’ లాంటి మంచి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ నుంచి ఇలాంటి సినిమాను ఎవరూ ఊహించలేదు.
ఐతే ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి దీని విషయంలో ఎప్పటికప్పుడు రిగ్రెట్ అవుతూనే ఉన్నాడు రాహుల్. నాగ్ అభిమానులకు పలుమార్లు సారీ కూడా చెప్పాడు. తాజాగా అతను ట్విట్టర్లో తనే హోస్ట్గా వ్యవహరిస్తూ ఒక స్పేస్ పెట్టాడు. ఇందులో ‘మన్మథుడు-2’ ప్రస్తావన వచ్చినపుడు.. ఆ చిత్రంలో ఎక్కడ తేడా జరిగిందో ఉదాహరణగా ఓ సన్నివేశం గురించి చెప్పాడు. సినిమా మొదలైన 20 నిమిషాలకు నాగ్ ఒక అమ్మాయితో ఘాటు రొమాన్స్ చేసే సన్నివేశం అది. ఆ సమయంలో రూం షేక్ అయిపోతున్నట్లుగా చూపిస్తారు. ఈ సన్నివేశం చూసి నాగ్ అభిమానులందరం తట్టుకోలేకపోయామని ఓ నెటిజన్ అంటే.. ఆ సీన్ తీసేటపుడు తాము నవ్వుకున్నామని, కానీ థియేటర్లో జనాల రెస్పాన్స్ చూస్తే తాము చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమైందని రాహుల్ అన్నాడు.
ఆ సన్నివేశం దగ్గరే ప్రేక్షకులు సినిమా పట్ల వ్యతిరేక బావానికి వచ్చేశారని, అలాంటి సీన్ తర్వాత తాము ‘శంకరాభరణం’ చూపించినా వాళ్ల అభిప్రాయం మారదని.. సినిమాలో ఆ సీన్ పెద్ద బ్లండర్ అయిందని రాహుల్ అంగీకరించాడు. ఒక నెటిజన్ ‘మన్మథుడు-2’ బ్యాడ్ మూవీ ఏమీ కాదని ఏదో అనబోతుంటే. రాహుల్ అందుకుని ఇలాంటి పాజిటివ్ కామెంట్లు చేయకండి, మళ్లీ నాగ్ ఫ్యాన్స్ తనను తగులుకుంటారని చెప్పడం విశేషం.
This post was last modified on June 1, 2021 3:22 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…