అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్న ఈ సిరీస్ కోసం ఫ్యామిలీ మ్యాన్ టీమ్ భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. దర్శకుడు రాజ్, డీకే తో పాటు సమంత కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. నేషనల్ వైడ్ గా ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తున్నారు. మే రెండో వారంలో సమంత కొన్ని బాలీవుడ్ పోర్టల్స్ కు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నారు.
దర్శకనిర్మాతలు సిరీస్ కు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని సమంతకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో సమంత టెర్రరిస్ట్ పాత్రలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళుల హక్కుల కోసం పోరాడిన వారిని ఇందులో టెర్రరిస్ట్ లుగా చూపిస్తున్నారంటూ తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. తమిళమ్మాయి అయిన సమంత ఈ సిరీస్ లో నటించడాన్ని తప్పుబడుతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ఆమెను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు.
ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సమంత ప్రమోషన్స్ లో పాల్గొంటే పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని భావించిన దర్శకనిర్మాతలు ఆమెని ప్రమోషన్స్ కు దూరంగా ఉంచుతున్నారు. సమంత కూడా ఈ వివాదంలో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదట. కానీ ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడ్డారు. అందుకే ప్రమోషన్స్ లో అత్యుత్సాహంతో పాల్గొన్నారు. ఈ సిరీస్ తో బాలీవుడ్ లో పాపులర్ కావాలనుకున్న సమంతకు కనీసం ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే సిరీస్ రిలీజైన తరువాత ఎలాగో హిట్ టాక్ వస్తుందని.. అప్పుడు మళ్లీ మీడియా ముందుకు వెళ్లొచ్చని సమంత భావిస్తున్నారట!
This post was last modified on June 2, 2021 6:08 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…