Movie News

పారితోష‌కాల‌కే 200 కోట్లు?

ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అంటే ప్ర‌భాసే. కేవ‌లం అత‌ణ్ని న‌మ్ముకుని వంద‌ల కోట్లు బ‌డ్జెట్లు పెడుతున్నారు. అంత‌కు మించి బిజినెస్ కూడా జ‌రుతుతోంది ఆ చిత్రాల‌కు. రాధేశ్యామ్ త‌ర్వాత ప్ర‌భాస్ లైన్లో పెట్టిన మూడు సినిమాల బ‌డ్జెట్ క‌లిపితే వెయ్యి కోట్ల‌కు పైమాటే అంటే అత‌డి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ముఖ్యంగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించ‌నున్న చిత్రం ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్క‌నున్న చిత్రం కానున్న‌ట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ముందు ఈ సినిమా బ‌డ్జెట్ రూ.300 కోట్ల‌న్నారు కానీ.. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఖ‌ర్చు రూ.500 కోట్ల దాకా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

కాగా ఈ 500 కోట్ల‌లో 40 శాతం బ‌డ్జెట్ కేవ‌లం పారితోష‌కాల‌కే పోనుంద‌ట‌. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే న‌టించ‌నుండ‌గా.. బిగ్-బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీళ్ల పారితోష‌కాలు భారీగానే ఉంటాయి. ఇక ప్ర‌భాస్ రేంజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ అత్య‌ధిక స‌మ‌యం వెచ్చించ‌నున్న‌ది ఈ చిత్రానికే అంటున్నారు. పారితోష‌కం రికార్డు స్థాయిలోనే ఉండ‌బోతోంద‌ట‌. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచే దాదాపు ప‌ది మంది ప్ర‌ముఖ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తారంటున్నారు.

ఇక మిగ‌తా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు అంద‌రికీ క‌లుపుకుంటే పారితోష‌కాల‌కు రూ.200 కోట్లు కావ‌డం ఆశ్చ‌ర్య‌మేమీ కాదు. మేకింగ్, అలాగే ప‌బ్లిసిటీకి క‌లిపి రూ.300 కోట్ల దాకా ఖ‌ర్చు పెట్ట‌నున్నార‌ట‌. ఈ ఏడాదే సినిమాను ప‌ట్టాలెక్కించాల‌నుకున్నారు కానీ కుద‌ర్లేదు. వ‌చ్చే ఏడాది షూటింగ్ మొద‌లుపెట్టి 2023 ద్వితీయార్ధంలో రిలీజ్ చేసే అవ‌కాశముంది.

This post was last modified on May 30, 2021 9:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago