Movie News

నిర్మాతలకు శర్వా లీగల్ నోటీసులు?


తెలుగులో దర్శక నిర్మాతలతో చాలా చక్కగా వ్యవహరిస్తాడని పేరున్న కథానాయకుల్లో శర్వానంద్ ఒకడు. అతడి చుట్టూ ఇప్పటిదాకా దాదాపు ఎలాంటి వివాదాలు లేవు. శర్వా గురించి అతడి పరోక్షంలోనూ అందరూ చాలా బాగా మాట్లాడతారు. నిర్మాతలు అతణ్ని ఆకాశానికెత్తేస్తుంటారు. అలాంటి నటుడికి ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నిర్మాతలతో వివాదం నెలకొందని.. తనకు రావాల్సిన పారితోషకం పెండింగ్ పెట్టడంతో లీగల్ నోటీసులు ఇచ్చే వరకు పరిస్థితి వెళ్లిందని వార్తలొస్తున్నాయి.

శర్వా చివరి సినిమా ‘శ్రీకారం’ను నిర్మించిన 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతోనేనట ఈ వివాదం. ఉదాత్తమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి మంచి రివ్యూలు కూడా తెచ్చుకున్న ‘శ్రీకారం’ కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నందుకోలేకపోయింది. నిర్మాతలకు కాస్త ఎక్కువగానే నష్టాలు తెచ్చిపెట్టింది. పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాలేదని సమాచారం.

కాగా శర్వాకు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రెమ్యూనరేషన్లో రూ.2 కోట్లు పెండింగ్ పెట్టారట నిర్మాతలు. రిలీజ్ తర్వాత ఈ డబ్బులు ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు. ఐతే సినిమా కమర్షియల్‌ సక్సెస్ కాక 14 రీల్స్ అధినేతలకు బాగా నష్టాలు తేవడంతో శర్వాకు బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వలేదట. దీని గురించి శర్వా మళ్లీ మళ్లీ అడుగుతున్నా వారి నుంచి స్పందన లేదట. దీంతో అతను లీగల్ నోటీసు ఇవ్వక తప్పలేదని అంటున్నారు. ఈ విషయంలో ఎవరిది తప్పో చెప్పడం కష్టం.

సినిమా ఎలాంటి ఫలితాన్నందుకున్నా దాంతో సంబంధం లేకుండా నటీనటులకు చెప్పిన ప్రకారం రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని కొందరంటారు. అదే సమయంలో నిర్మాతల కష్టాన్ని అర్థం చేసుకుని బ్యాలెన్స్ పేమెంట్ వదులుకోవాల్సిందని ఇంకొందరంటారు. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా విషయంలోనే ఇలాంటి వివాదమే తలెత్తి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్.. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు అప్పట్లో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శర్వా ఇలా చేయడం చిత్రమేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on May 29, 2021 7:52 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

2 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

3 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

4 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

5 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

5 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

6 hours ago