Movie News

ముగ్గురు హీరోలు నో చెప్పాక.. కళ్యాణ్ రామ్ తో!

చాలా ఏళ్లుగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావాలని చూస్తున్నారు మల్లిడి వేణు. గతంలో హీరో నితిన్, రామ్ లాంటి వాళ్లకు కథలు చెప్పారు. కానీ వర్కవుట్ కాలేదు. 2016లో అల్లు శిరీష్ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమాను లాంచ్ కూడా చేశారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. దానికి బడ్జెట్ సమస్యలే కారణమని సమాచారం. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలనుకున్నారు.

ఏడెనిమిది వందల ఏళ్ల కిందటి నేపథ్యంలో కథ ఉంటుందని అప్పట్లో అల్లు శిరీష్ చెప్పారు ముందుగా అల్లు శిరీష్ మార్కెట్ పరిధుల్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. సినిమా కోసం ఓ భారీ దర్బార్ సెట్ కూడా వేయాలనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే బడ్జెట్ దాటిపోయే అవకాశం ఉందని భావించిన అల్లు అరవింద్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారు. అప్పటినుండి మల్లిడి వేణు హీరోల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ఓకే అయింది. వశిష్ట్ గా పేరు మార్చుకొని సినిమా అనౌన్స్ చేశారు మల్లిడి వేణు. అదే ‘బింబిసార’.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి చిన్న టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విజువల్స్ చూసిన ఇండస్ట్రీకి చెందిన కొందరు.. ఇది అల్లు శిరీష్ కోసం అనుకున్న కథే అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అప్పటి కథనే ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో తీస్తున్నారా..? లేక మరో హిస్టారికల్ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నారా..? అనే విషయంపై దర్శకుడు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!

This post was last modified on May 29, 2021 7:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

1 hour ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

2 hours ago

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక…

3 hours ago

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా,…

5 hours ago

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

8 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

12 hours ago