చాలా ఏళ్లుగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావాలని చూస్తున్నారు మల్లిడి వేణు. గతంలో హీరో నితిన్, రామ్ లాంటి వాళ్లకు కథలు చెప్పారు. కానీ వర్కవుట్ కాలేదు. 2016లో అల్లు శిరీష్ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమాను లాంచ్ కూడా చేశారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. దానికి బడ్జెట్ సమస్యలే కారణమని సమాచారం. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలనుకున్నారు.
ఏడెనిమిది వందల ఏళ్ల కిందటి నేపథ్యంలో కథ ఉంటుందని అప్పట్లో అల్లు శిరీష్ చెప్పారు ముందుగా అల్లు శిరీష్ మార్కెట్ పరిధుల్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. సినిమా కోసం ఓ భారీ దర్బార్ సెట్ కూడా వేయాలనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే బడ్జెట్ దాటిపోయే అవకాశం ఉందని భావించిన అల్లు అరవింద్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారు. అప్పటినుండి మల్లిడి వేణు హీరోల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ఓకే అయింది. వశిష్ట్ గా పేరు మార్చుకొని సినిమా అనౌన్స్ చేశారు మల్లిడి వేణు. అదే ‘బింబిసార’.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి చిన్న టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విజువల్స్ చూసిన ఇండస్ట్రీకి చెందిన కొందరు.. ఇది అల్లు శిరీష్ కోసం అనుకున్న కథే అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అప్పటి కథనే ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో తీస్తున్నారా..? లేక మరో హిస్టారికల్ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నారా..? అనే విషయంపై దర్శకుడు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!
This post was last modified on May 29, 2021 7:51 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…