బాలనటుడిగా గొప్ప పేరు సంపాదించి.. హీరోగా తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తో బ్లాక్ బస్టర్ అందుకుని.. ఆపై ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను లాంటి సూపర్ హిట్లతో ఊపు మీద కనిపించాడు తరుణ్ ఒకప్పుడు. యూత్లో అతడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. తరుణ్ పెద్ద స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు.
కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక గాడి తప్పాడు ఈ యంగ్ హీరో. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చి ఫేడవుట్ అయిపోయాడు. గత దశాబ్ద కాలంలో అతను రెండో మూడో సినిమాలు చేశాడు. అవి రిలీజైనట్లు కూడా జనాలకు తెలియదు. చివరగా ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమా చేయగా.. అది చూసిన ప్రేక్షకులకు తలలు బొప్పి కట్టాయి. ఈ దెబ్బతో అతడి కెరీర్ క్లోజ్ అయిపోయింది. తరుణ్ హీరోగా మొదలైన కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోగా.. కొత్తగా అతడితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
జనాలు పూర్తిగా తరుణ్ను మరిచిపోయిన ఈ సమయంలో అతను కొత్త అవతారం ఎత్తాడు. ఆశ్చర్యకరంగా తరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తడం విశేషం. అది కూడా ఏదో ఒక పెద్ద తమిళ సినిమాకైనా ఓకే అనుకోవచ్చు. ‘ఆహా’ ఓటీటీలో రిలీజైన ‘అనుకోని అతిథి’ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ చేసిన లీడ్ రోల్కు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. ఇది రెండేళ్ల కిందటి ‘అతిరన్’ సినిమాకు డబ్బింగ్ వెర్షన్.
ఆహా ఓటీటీ పెట్టినప్పటి నుంచి ఎక్కువగా మలయాళం సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ రేటుకు డబ్బింగ్ హక్కులు తీసుకుని, పరిమిత ఖర్చుతో డబ్బింగ్ చేయించి ప్రిమియర్స్ వేసుకుంటున్నారు. ఈ కోవలో వచ్చిన చిత్రానికి తరుణ్ డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. నటుడిగా ఇక తనకు కెరీర్ లేదనుకుని బేషజాలు లేకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాలని తరుణ్ అనుకుని ఉండొచ్చు. అది మంచి నిర్ణయమే కావచ్చు. కానీ ఆ మార్గం ఎంచుకున్నా సరే.. కొంచెం స్థాయి చూసుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 28, 2021 5:40 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…