బాలనటుడిగా గొప్ప పేరు సంపాదించి.. హీరోగా తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తో బ్లాక్ బస్టర్ అందుకుని.. ఆపై ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను లాంటి సూపర్ హిట్లతో ఊపు మీద కనిపించాడు తరుణ్ ఒకప్పుడు. యూత్లో అతడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. తరుణ్ పెద్ద స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు.
కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక గాడి తప్పాడు ఈ యంగ్ హీరో. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చి ఫేడవుట్ అయిపోయాడు. గత దశాబ్ద కాలంలో అతను రెండో మూడో సినిమాలు చేశాడు. అవి రిలీజైనట్లు కూడా జనాలకు తెలియదు. చివరగా ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమా చేయగా.. అది చూసిన ప్రేక్షకులకు తలలు బొప్పి కట్టాయి. ఈ దెబ్బతో అతడి కెరీర్ క్లోజ్ అయిపోయింది. తరుణ్ హీరోగా మొదలైన కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోగా.. కొత్తగా అతడితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
జనాలు పూర్తిగా తరుణ్ను మరిచిపోయిన ఈ సమయంలో అతను కొత్త అవతారం ఎత్తాడు. ఆశ్చర్యకరంగా తరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తడం విశేషం. అది కూడా ఏదో ఒక పెద్ద తమిళ సినిమాకైనా ఓకే అనుకోవచ్చు. ‘ఆహా’ ఓటీటీలో రిలీజైన ‘అనుకోని అతిథి’ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ చేసిన లీడ్ రోల్కు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. ఇది రెండేళ్ల కిందటి ‘అతిరన్’ సినిమాకు డబ్బింగ్ వెర్షన్.
ఆహా ఓటీటీ పెట్టినప్పటి నుంచి ఎక్కువగా మలయాళం సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ రేటుకు డబ్బింగ్ హక్కులు తీసుకుని, పరిమిత ఖర్చుతో డబ్బింగ్ చేయించి ప్రిమియర్స్ వేసుకుంటున్నారు. ఈ కోవలో వచ్చిన చిత్రానికి తరుణ్ డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. నటుడిగా ఇక తనకు కెరీర్ లేదనుకుని బేషజాలు లేకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాలని తరుణ్ అనుకుని ఉండొచ్చు. అది మంచి నిర్ణయమే కావచ్చు. కానీ ఆ మార్గం ఎంచుకున్నా సరే.. కొంచెం స్థాయి చూసుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 28, 2021 5:40 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…