టాలీవుడ్ సీనియర్ హీరోల్లో శరవేగంగా సినిమాలు చేసుకుపోయే వాళ్లలో విక్టరీ వెంకటేష్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆయన కొన్ని నెలల్లోనే సినిమాలు అవగొట్టేస్తుంటారు. తరచుగా రీమేక్స్ చేయడం వల్ల కూడా ఈ స్పీడు చూపించగలుగుతుంటారు వెంకీ. తాజాగా ఆయన మలయాళ చిత్రం ‘దృశ్యం-2’ రీమేక్ను నెలన్నర రోజుల్లో ముగించేసిన సంగతి తెలిసిందే. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తున్నాయి.
ఐతే దీని కంటే ముందు ‘నారప్ప’ పూర్తయిన నేపథ్యంలో ముందు దాన్ని రిలీజ్ చేసి, ఆ తర్వాత ‘దృశ్యం-2’ సంగతి చూడాలని నిర్మాత సురేష్ బాబు అనుకున్నాడు. మధ్యలో ‘దృశ్యం-2’ ఓటీటీలో వస్తుందన్న ప్రచారం జరగ్గా అలాంటిదేమీ లేదని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఐతే థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకుని, తర్వాత ఆలోచన మార్చుకుని ఓటీటీల్లో విడుదల చేసిన సినిమాలు లేకపోలేదు. వి, నిశ్శబ్దం లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ.
‘దృశ్యం-2’ విషయంలోనూ ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనలు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్లు ఆగస్టుకు కానీ తెరుచుకునే అవకాశం లేకపోవడం, పైగా 100 శాతం ఆక్యుపెన్సీకి ఇంకా సమయం పట్టేలా ఉండటం, ‘నారప్ప’ను రిలీజ్ చేసి గ్యాప్ ఇచ్చి ‘దృశ్యం-2’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేసరికి చాలా ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సురేష్ బాబు రెడీ అయిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ అమేజాన్ ప్రైమ్ వాళ్లతో చర్చలు కూడా జరిపారని, డీల్ కూడా ఓకే అయిందని.. త్వరలోనే దీని గురించి ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. కుదిరితే జూన్లోనే ఈ చిత్రాన్ని ప్రైమ్లో రిలీజ్ చేయొచ్చని అంటున్నారు.
మలయాళ ‘దృశ్యం-2’ను ఫిబ్రవరిలో నేరుగా ప్రైమ్ వాళ్లే రిలీజ్ చేయడం తెలిసిందే. ఇప్పుడు అదే ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజైతే ఒకే సినిమా రెండు భాషల్లో ఒకే చోట అందుబాటులో ఉంటుందన్నమాట.
This post was last modified on May 27, 2021 8:15 am
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…