టాలీవుడ్ సీనియర్ హీరోల్లో శరవేగంగా సినిమాలు చేసుకుపోయే వాళ్లలో విక్టరీ వెంకటేష్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆయన కొన్ని నెలల్లోనే సినిమాలు అవగొట్టేస్తుంటారు. తరచుగా రీమేక్స్ చేయడం వల్ల కూడా ఈ స్పీడు చూపించగలుగుతుంటారు వెంకీ. తాజాగా ఆయన మలయాళ చిత్రం ‘దృశ్యం-2’ రీమేక్ను నెలన్నర రోజుల్లో ముగించేసిన సంగతి తెలిసిందే. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తున్నాయి.
ఐతే దీని కంటే ముందు ‘నారప్ప’ పూర్తయిన నేపథ్యంలో ముందు దాన్ని రిలీజ్ చేసి, ఆ తర్వాత ‘దృశ్యం-2’ సంగతి చూడాలని నిర్మాత సురేష్ బాబు అనుకున్నాడు. మధ్యలో ‘దృశ్యం-2’ ఓటీటీలో వస్తుందన్న ప్రచారం జరగ్గా అలాంటిదేమీ లేదని కూడా ఆయన స్పష్టం చేశాడు. ఐతే థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకుని, తర్వాత ఆలోచన మార్చుకుని ఓటీటీల్లో విడుదల చేసిన సినిమాలు లేకపోలేదు. వి, నిశ్శబ్దం లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ.
‘దృశ్యం-2’ విషయంలోనూ ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనలు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్లు ఆగస్టుకు కానీ తెరుచుకునే అవకాశం లేకపోవడం, పైగా 100 శాతం ఆక్యుపెన్సీకి ఇంకా సమయం పట్టేలా ఉండటం, ‘నారప్ప’ను రిలీజ్ చేసి గ్యాప్ ఇచ్చి ‘దృశ్యం-2’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేసరికి చాలా ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సురేష్ బాబు రెడీ అయిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ అమేజాన్ ప్రైమ్ వాళ్లతో చర్చలు కూడా జరిపారని, డీల్ కూడా ఓకే అయిందని.. త్వరలోనే దీని గురించి ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. కుదిరితే జూన్లోనే ఈ చిత్రాన్ని ప్రైమ్లో రిలీజ్ చేయొచ్చని అంటున్నారు.
మలయాళ ‘దృశ్యం-2’ను ఫిబ్రవరిలో నేరుగా ప్రైమ్ వాళ్లే రిలీజ్ చేయడం తెలిసిందే. ఇప్పుడు అదే ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజైతే ఒకే సినిమా రెండు భాషల్లో ఒకే చోట అందుబాటులో ఉంటుందన్నమాట.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…