సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ల అభిమానులు బయట, సామాజిక మాధ్యమాల్లో తెగ కొట్టేసుకుంటూ ఉంటారు కానీ.. నిజానికి ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చాలా సన్నిహితంగా ఉంటారు. సినిమాల పరంగా ఒకరికొకరు సాయం కూడా చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఒకరి సినిమాల్లో ఒకరు క్యామియోలు కూడా చేశారు. చివరగా సల్మాన్ నటించిన ‘ట్యూబ్ లైట్’లో షారుఖ్ క్యామియో చేస్తే.. షారుఖ్ చిత్రం ‘జీరో’లో సల్మాన్ మెరిశాడు.
ఈ ఒరవడిని కొనసాగిస్తూ షారుఖ్ కొత్త సినిమా ‘పఠాన్’లో మరోసారి తళుక్కుమనబోతున్నాడట సల్మాన్. ఐతే ఈసారి అతడి పాత్ర రంగప్రవేశం చేసే వ్యవహారమే చాలా వేరుగా ఉండబోతోందట. సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్-3’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది కొనసాగింపు చిత్రమన్న సంగతి తెలిసిందే.
‘టైగర్’ చిత్రాల ఫ్రాంఛైజీ యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లదే అన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థలోనే షారుఖ్ సినిమా ‘పఠాన్’ కూడా తెరకెక్కుతోంది. ‘వార్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న చిత్రమిది. అతను యశ్ రాజ్ ఫిలిమ్స్కు ఆస్థాన దర్శకుడి లాంటి వాడు. దీంతో అదే సంస్థలో తెరకెక్కుతున్న ‘టైగర్’ సినిమాలో లీడ్ రోల్ను తన చిత్రం కోసం వాడుకుంటున్నాడట. ఇందులో షారుఖ్ చేస్తున్నది గూఢచారి పాత్ర కాగా.. ఆ పాత్రకు రష్యన్ గన్ మాఫియా నుంచి ముప్పు ఏర్పడితే అప్పుడు టైగర్గా సల్మాన్ ఎంట్రీ ఇచ్చి అతణ్ని కాపాడతాడట.
ఈ క్రమంలో పెద్ద యాక్షన్ ఘట్టం ఉంటుందని.. అందులో షారుఖ్, సల్మాన్ జోడీగా విలన్ల పని పడతారని.. సినిమాకే హైలైట్గా నిలిచేలా ఈ ఎపిసోడ్ను తీర్చిదిద్దుతున్నారని.. ఈసారి షారుఖ్-సల్మాన్ జోడీ అభిమానులకు మంచి అనుభూతిని మిగల్చడం గ్యారెంటీ అని అంటున్నారు. ‘జీరో’ సహా గత కొన్నేళ్లలో షారుఖ్ నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్లే. దీంతో రెండేళ్లకు పైగా విరామం తర్వాత ఆచితూచి చేస్తున్న ‘పఠాన్’ మీద షారుఖ్ ఎన్నో ఆశలతో ఉన్నాడు.
This post was last modified on May 26, 2021 12:35 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…
తమిళనాడులో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత, నటుడు విజయ్.. నేతృత్వంలోని సర్కారు.. తొలి బడ్జెట్ను(2026-27)ను బుధవారం అసెంబ్లీలో…
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…