సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ల అభిమానులు బయట, సామాజిక మాధ్యమాల్లో తెగ కొట్టేసుకుంటూ ఉంటారు కానీ.. నిజానికి ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చాలా సన్నిహితంగా ఉంటారు. సినిమాల పరంగా ఒకరికొకరు సాయం కూడా చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఒకరి సినిమాల్లో ఒకరు క్యామియోలు కూడా చేశారు. చివరగా సల్మాన్ నటించిన ‘ట్యూబ్ లైట్’లో షారుఖ్ క్యామియో చేస్తే.. షారుఖ్ చిత్రం ‘జీరో’లో సల్మాన్ మెరిశాడు.
ఈ ఒరవడిని కొనసాగిస్తూ షారుఖ్ కొత్త సినిమా ‘పఠాన్’లో మరోసారి తళుక్కుమనబోతున్నాడట సల్మాన్. ఐతే ఈసారి అతడి పాత్ర రంగప్రవేశం చేసే వ్యవహారమే చాలా వేరుగా ఉండబోతోందట. సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్-3’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు ఇది కొనసాగింపు చిత్రమన్న సంగతి తెలిసిందే.
‘టైగర్’ చిత్రాల ఫ్రాంఛైజీ యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లదే అన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థలోనే షారుఖ్ సినిమా ‘పఠాన్’ కూడా తెరకెక్కుతోంది. ‘వార్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న చిత్రమిది. అతను యశ్ రాజ్ ఫిలిమ్స్కు ఆస్థాన దర్శకుడి లాంటి వాడు. దీంతో అదే సంస్థలో తెరకెక్కుతున్న ‘టైగర్’ సినిమాలో లీడ్ రోల్ను తన చిత్రం కోసం వాడుకుంటున్నాడట. ఇందులో షారుఖ్ చేస్తున్నది గూఢచారి పాత్ర కాగా.. ఆ పాత్రకు రష్యన్ గన్ మాఫియా నుంచి ముప్పు ఏర్పడితే అప్పుడు టైగర్గా సల్మాన్ ఎంట్రీ ఇచ్చి అతణ్ని కాపాడతాడట.
ఈ క్రమంలో పెద్ద యాక్షన్ ఘట్టం ఉంటుందని.. అందులో షారుఖ్, సల్మాన్ జోడీగా విలన్ల పని పడతారని.. సినిమాకే హైలైట్గా నిలిచేలా ఈ ఎపిసోడ్ను తీర్చిదిద్దుతున్నారని.. ఈసారి షారుఖ్-సల్మాన్ జోడీ అభిమానులకు మంచి అనుభూతిని మిగల్చడం గ్యారెంటీ అని అంటున్నారు. ‘జీరో’ సహా గత కొన్నేళ్లలో షారుఖ్ నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్లే. దీంతో రెండేళ్లకు పైగా విరామం తర్వాత ఆచితూచి చేస్తున్న ‘పఠాన్’ మీద షారుఖ్ ఎన్నో ఆశలతో ఉన్నాడు.
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్..తన పార్టీని తెలంగాణలోనూ విస్తరించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని…