తల్లిదండ్రుల మధ్య విభేదాలొచ్చి విడిపోతుంటే పిల్లల బాధ అంతా ఇంతా కాదు. అందులోనూ వాళ్లకు ఊహ తెలిశాక తల్లిదండ్రులు విడిపోతుంటే తట్టుకోలేరు. వాళ్లు కలిసి ఉండాలనే కోరుకుంటారు. కానీ తమ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక విడిపోవడం అప్పట్లో బాధ కలిగించినప్పటికీ.. విడాకులు తీసుకోవాలన్న వాళ్ల నిర్ణయం మంచిదే అని శ్రుతి హాసన్ అభిప్రాయపడింది. 1988లో కమల్, సారిక పెళ్లి చేసుకోగా.. 16 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2004లో వీళ్లిద్దరూ విడిపోయారు. ఇక అప్పట్నుంచి శ్రుతి, అక్షర ఎక్కువగా చెన్నైలో తండ్రి దగ్గరే పెరిగారు. కథానాయికగా ఒక స్థాయి అందుకున్నాక శ్రుతి వేరుగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి తన తల్లిదండ్రుల విడాకుల గురించి మాట్లాడింది.
మా అమ్మా నాన్నలు విడిపోవడం గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఉద్వేగానికి గురవుతా. ఒకరితో ఒకరికి పొసగనపుడు వేరుగా ఉండటమే సరైందని నేను భావిస్తా. వాళ్లిద్దరూ మా తల్లిదండ్రులుగా గొప్పగా తమ బాధ్యతను నిర్వర్తించారు. నేను ఎక్కువగా నాన్నతో గడిపాను. అమ్మ తన బాధ్యతగా ఏం చేయాలో అది చేసింది. విడాకులు తీసుకోవడం వల్ల ఇద్దరికీ మంచే జరిగింది. వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ ఉత్తమమైన వాళ్లే. కానీ ఇద్దరు ఉత్తములు కలిసి ఆనందంగా జీవించగలరనేమీ లేదు. నిజానికి వాళ్లు కలిసి ఉన్నప్పటి కంటే విడిపోయాక ఎక్కువ సంతోషంగా ఉన్నారు. మా అమ్మ, నాన్న విడిపోయిన సమయానికి నాది చిన్న వయసు. అప్పుడు బాధ పడ్డా సరే.. తర్వాత వాళ్ల నిర్ణయం సరైందని అర్థం చేసుకున్నా అని శ్రుతి చెప్పింది. ఇటీవలే క్రాక్ సినిమాతో తెలుగులో మంచి విజయాన్నందుకున్న శ్రుతి.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 26, 2021 1:35 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…