Movie News

ఆచార్య.. ఇంకో 10 రోజులు ఆగి ఉంటే

అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి ‘ఆచార్య’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ప్రణాళికలన్నీ తారుమారు అయ్యాయి. చాలా సినిమాల మాదిరే ఇది కూడా వాయిదా పడిపోయింది. ఐతే ఈ సినిమా ఎంత వరకు పూర్తయింది.. ఇంకా ఎంత మిగిలి ఉంది.. మళ్లీ ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.. అన్నదానిపై ప్రేక్షకుల్లో స్పష్టత లేదు. ఐతే తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ విశేషాలపై మాట్లాడాడు.

‘ఆచార్య’ చిత్రీకరణను గత ఏడాది జనవరిలో మొదలుపెట్టామని.. ఐతే తొలి షెడ్యూల్లో కొన్ని రోజులు మాత్రమే చిత్రీకరణ జరిగిందని.. పాటతో పాటు కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించామని.. ఆ తర్వాత కరోనా-లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందని కొరటాల చెప్పాడు. ఈ విరామం తర్వాత గత ఏడాది చివర్లో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టామని.. ఈసారి మాత్రం చాలా బాగా చిత్రీకరణ సాగిందని.. మూణ్నాలుగు నెలల్లో చాలా వరకు చిత్రీకరణ పూర్తయిందని కొరటాల చెప్పాడు. ఇంకో పది పన్నెండు రోజులు చిత్రీకరణ జరిపి ఉంటే సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యేదని కొరటాల చెప్పాడు.

షూటింగ్ ఆపేయడానికి ముందు ఫారెస్ట్ షెడ్యూల్ జరిగిందని.. అందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించామని.. కరోనా సెకండ్ వేవ్ గురించి చర్చ మొదలైనపుడు కూడా జోరుగా షూటింగ్ చేశామని.. కానీ ఇంతలో తీవ్రత పెరిగిపోయిందని.. చిరంజీవి సహా అందరినీ రిస్క్‌లో పెట్టడం కరెక్ట్ కాదనిపించి షూటింగ్ ఆపేశామని కొరటాల చెప్పాడు. పరిస్థితులు చక్కబడ్డాక సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తామని కొరటాల చెప్పాడు. కొరటాల మాటల్ని బట్టి చూస్తుంటే ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశముంది.

This post was last modified on May 24, 2021 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

16 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

1 hour ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago