అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి ‘ఆచార్య’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ప్రణాళికలన్నీ తారుమారు అయ్యాయి. చాలా సినిమాల మాదిరే ఇది కూడా వాయిదా పడిపోయింది. ఐతే ఈ సినిమా ఎంత వరకు పూర్తయింది.. ఇంకా ఎంత మిగిలి ఉంది.. మళ్లీ ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.. అన్నదానిపై ప్రేక్షకుల్లో స్పష్టత లేదు. ఐతే తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కొరటాల శివ ఈ విశేషాలపై మాట్లాడాడు.
‘ఆచార్య’ చిత్రీకరణను గత ఏడాది జనవరిలో మొదలుపెట్టామని.. ఐతే తొలి షెడ్యూల్లో కొన్ని రోజులు మాత్రమే చిత్రీకరణ జరిగిందని.. పాటతో పాటు కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించామని.. ఆ తర్వాత కరోనా-లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందని కొరటాల చెప్పాడు. ఈ విరామం తర్వాత గత ఏడాది చివర్లో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టామని.. ఈసారి మాత్రం చాలా బాగా చిత్రీకరణ సాగిందని.. మూణ్నాలుగు నెలల్లో చాలా వరకు చిత్రీకరణ పూర్తయిందని కొరటాల చెప్పాడు. ఇంకో పది పన్నెండు రోజులు చిత్రీకరణ జరిపి ఉంటే సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యేదని కొరటాల చెప్పాడు.
షూటింగ్ ఆపేయడానికి ముందు ఫారెస్ట్ షెడ్యూల్ జరిగిందని.. అందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించామని.. కరోనా సెకండ్ వేవ్ గురించి చర్చ మొదలైనపుడు కూడా జోరుగా షూటింగ్ చేశామని.. కానీ ఇంతలో తీవ్రత పెరిగిపోయిందని.. చిరంజీవి సహా అందరినీ రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదనిపించి షూటింగ్ ఆపేశామని కొరటాల చెప్పాడు. పరిస్థితులు చక్కబడ్డాక సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్రయత్నిస్తామని కొరటాల చెప్పాడు. కొరటాల మాటల్ని బట్టి చూస్తుంటే ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశముంది.
This post was last modified on May 24, 2021 1:59 pm
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…
‘స్పిరిట్’లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే ఫైట్ కేవలం ఒక ఫైట్ కాదు. ఇది రెండు పవర్ సెంటర్ల…