హిందీ సినిమాలకు ఏడాది కిందట్నుంచి గడ్డు కాలం నడుస్తోంది. వేరే పరిశ్రమలు కొవిడ్ దెబ్బ నుంచి కొంచెం కోలుకుని థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసుకున్నాయి. మంచి విజయాలందుకున్నాయి. మంచి వసూళ్లు కూడా రాబట్టుకున్నాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం ఇలా పుంజుకోలేకపోయాయి. థియేటర్లలో సందడి తేలేకపోయాయి.
కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం థియేటర్లలో రిలీజైన హిందీ సినిమాలు చాలా వరకు చిన్నా చితకావే. వాటికి కనీస స్పందన కూడా కరవైంది. ఇక సెకండ్ వేవ్ దెబ్బకు అవి కూడా లేకపోయాయి. ఉత్తరాదిన థియేటర్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.
మళ్లీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడేలా లేకపోవడంతో చాలా కాలం నుంచి ఆపి పెట్టుకున్న భారీ చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఈ దిశగా సల్మాన్ ఖాన్ ‘రాధె’ సినిమాతో దారి చూపించింది. అది పేలవమైన సినిమా అయినప్పటికీ ఓటీటీలో మంచి ఫలితాన్నే అందుకుంది.
ఈ నేపథ్యంలో మరిన్ని పెద్ద సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ కొత్త చిత్రం ‘బెల్ బాటమ్’ ఈ వరుసలో రాబోతున్న మరో భారీ చిత్రం అని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారీ ధరకే హక్కులు అమ్మారట.
త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారట. గత ఏడాది అక్షయ్ సినిమా ‘లక్ష్మి’ హాట్ స్టార్లో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సినిమాను మించి ‘బెల్ బాటమ్’కు ఎక్కువ రేటే పలికినట్లు తెలుస్తోంది. రంజిత్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ మూవీని పూర్తిగా యూరప్లో చిత్రీకరించారు.
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత చిత్ర బృందమంతా యూరప్కు వెళ్లి ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చింది. ఈ చిత్రంలో అక్షయ్ సరసన వాణి కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా నటించారు. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నట్లు సమాచారం. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ సినిమా ‘భూత్ పోలీస్’ను సైతం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది.
This post was last modified on May 23, 2021 12:18 pm
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…