ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కథానాయిక పాయల్ రాజ్పుత్. ఆ సినిమాలో సెన్సేషనల్ క్యారెక్టర్లో బోల్డ్గా నటించి ఎక్కడలేని పాపులారిటీ సంపాదించిన పాయల్.. వెంటనే పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. కాకపోతే ఆ ఎంపికలో తప్పటడుగులు వేయడంతో పాయల్ కెరీర్ అనుకున్నుంతగా ఊపందుకోలేదు. చివరగా అనగనగా ఓ అతిథి అనే థ్రిల్లర్ సినిమాలో నటించిన పాయల్కు.. తెలుగులో అయితే అవకాశాలు దాదాపుగా ఆగిపోయినట్లే ఉంది. తమిళంలో ఏంజెల్ అనే సినిమాలో నటిస్తోందామె.
ఐతే మున్ముందు తన కెరీర్ ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఈ లోపే పాయల్ తన పెళ్లికి రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. తన బాయ్ ఫ్రెండ్ పేరు సౌరభ్ ధింగ్రా అని, తమ పెళ్లి కూడా నిశ్చయం అయిందని పాయల్ అనుకోకుండా వెల్లడించింది.
ఇటీవల సౌరభ్ తల్లి కరోనా కారణంగా మృతి చెందింది. దీంతో పాయల్ రాజ్పుత్ తీవ్రంగా కలత చెందింది. ఓ మీడియా సంస్థతో దీనిపై మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త తల్లితో తనకు గొప్ప అనుబంధం.. ఆమె చనిపోవడంతో గట్టిగా ఏడవాలనిపిస్తోందని ఆమె చెప్పింది. సౌరభ్ ఇంట్లో, తమ ఇంట్లో తమ రిలేషన్షిప్ గురించి తెలుసని.. అందరూ పెళ్లికి అంగీకరించారని.. ఐతే తమ పెళ్లి చూడకుండానే ఇప్పుడు సౌరభ్ తల్లి వెళ్లిపోవడం ఎంతగానో బాధిస్తోందని పాయల్ చెప్పింది.
సోషల్ మీడియాలో పాయల్ను ఫాలో అయ్యేవాళ్ళకు సౌరభ్ గురించి తెలుసు. పాయల్తో కలిసి కొన్ని సినిమా వేడుకలతో పాటు తన చిత్రాల షూటింగ్స్కు కూడా అతను హాజరవుతుంటాడని అంటారు. హైదరాబాద్లో కొంత కాలంగా వీళ్లిద్దరూ ఒకే ఫ్లాట్లో కూడా ఉంటున్నట్లు సమాచారం. ఐతే ఇన్నాళ్లు అతడి గురించి బయటికి ఏమీ మాట్లాడని పాయల్.. ఈ విషాద వేళ తనకు కాబోయే భర్త అతనని, తామిద్దరంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించింది.
This post was last modified on May 20, 2021 8:26 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…