ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కథానాయిక పాయల్ రాజ్పుత్. ఆ సినిమాలో సెన్సేషనల్ క్యారెక్టర్లో బోల్డ్గా నటించి ఎక్కడలేని పాపులారిటీ సంపాదించిన పాయల్.. వెంటనే పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. కాకపోతే ఆ ఎంపికలో తప్పటడుగులు వేయడంతో పాయల్ కెరీర్ అనుకున్నుంతగా ఊపందుకోలేదు. చివరగా అనగనగా ఓ అతిథి అనే థ్రిల్లర్ సినిమాలో నటించిన పాయల్కు.. తెలుగులో అయితే అవకాశాలు దాదాపుగా ఆగిపోయినట్లే ఉంది. తమిళంలో ఏంజెల్ అనే సినిమాలో నటిస్తోందామె.
ఐతే మున్ముందు తన కెరీర్ ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఈ లోపే పాయల్ తన పెళ్లికి రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. తన బాయ్ ఫ్రెండ్ పేరు సౌరభ్ ధింగ్రా అని, తమ పెళ్లి కూడా నిశ్చయం అయిందని పాయల్ అనుకోకుండా వెల్లడించింది.
ఇటీవల సౌరభ్ తల్లి కరోనా కారణంగా మృతి చెందింది. దీంతో పాయల్ రాజ్పుత్ తీవ్రంగా కలత చెందింది. ఓ మీడియా సంస్థతో దీనిపై మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త తల్లితో తనకు గొప్ప అనుబంధం.. ఆమె చనిపోవడంతో గట్టిగా ఏడవాలనిపిస్తోందని ఆమె చెప్పింది. సౌరభ్ ఇంట్లో, తమ ఇంట్లో తమ రిలేషన్షిప్ గురించి తెలుసని.. అందరూ పెళ్లికి అంగీకరించారని.. ఐతే తమ పెళ్లి చూడకుండానే ఇప్పుడు సౌరభ్ తల్లి వెళ్లిపోవడం ఎంతగానో బాధిస్తోందని పాయల్ చెప్పింది.
సోషల్ మీడియాలో పాయల్ను ఫాలో అయ్యేవాళ్ళకు సౌరభ్ గురించి తెలుసు. పాయల్తో కలిసి కొన్ని సినిమా వేడుకలతో పాటు తన చిత్రాల షూటింగ్స్కు కూడా అతను హాజరవుతుంటాడని అంటారు. హైదరాబాద్లో కొంత కాలంగా వీళ్లిద్దరూ ఒకే ఫ్లాట్లో కూడా ఉంటున్నట్లు సమాచారం. ఐతే ఇన్నాళ్లు అతడి గురించి బయటికి ఏమీ మాట్లాడని పాయల్.. ఈ విషాద వేళ తనకు కాబోయే భర్త అతనని, తామిద్దరంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించింది.
This post was last modified on May 20, 2021 8:26 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…