ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కథానాయిక పాయల్ రాజ్పుత్. ఆ సినిమాలో సెన్సేషనల్ క్యారెక్టర్లో బోల్డ్గా నటించి ఎక్కడలేని పాపులారిటీ సంపాదించిన పాయల్.. వెంటనే పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. కాకపోతే ఆ ఎంపికలో తప్పటడుగులు వేయడంతో పాయల్ కెరీర్ అనుకున్నుంతగా ఊపందుకోలేదు. చివరగా అనగనగా ఓ అతిథి అనే థ్రిల్లర్ సినిమాలో నటించిన పాయల్కు.. తెలుగులో అయితే అవకాశాలు దాదాపుగా ఆగిపోయినట్లే ఉంది. తమిళంలో ఏంజెల్ అనే సినిమాలో నటిస్తోందామె.
ఐతే మున్ముందు తన కెరీర్ ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఈ లోపే పాయల్ తన పెళ్లికి రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. తన బాయ్ ఫ్రెండ్ పేరు సౌరభ్ ధింగ్రా అని, తమ పెళ్లి కూడా నిశ్చయం అయిందని పాయల్ అనుకోకుండా వెల్లడించింది.
ఇటీవల సౌరభ్ తల్లి కరోనా కారణంగా మృతి చెందింది. దీంతో పాయల్ రాజ్పుత్ తీవ్రంగా కలత చెందింది. ఓ మీడియా సంస్థతో దీనిపై మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త తల్లితో తనకు గొప్ప అనుబంధం.. ఆమె చనిపోవడంతో గట్టిగా ఏడవాలనిపిస్తోందని ఆమె చెప్పింది. సౌరభ్ ఇంట్లో, తమ ఇంట్లో తమ రిలేషన్షిప్ గురించి తెలుసని.. అందరూ పెళ్లికి అంగీకరించారని.. ఐతే తమ పెళ్లి చూడకుండానే ఇప్పుడు సౌరభ్ తల్లి వెళ్లిపోవడం ఎంతగానో బాధిస్తోందని పాయల్ చెప్పింది.
సోషల్ మీడియాలో పాయల్ను ఫాలో అయ్యేవాళ్ళకు సౌరభ్ గురించి తెలుసు. పాయల్తో కలిసి కొన్ని సినిమా వేడుకలతో పాటు తన చిత్రాల షూటింగ్స్కు కూడా అతను హాజరవుతుంటాడని అంటారు. హైదరాబాద్లో కొంత కాలంగా వీళ్లిద్దరూ ఒకే ఫ్లాట్లో కూడా ఉంటున్నట్లు సమాచారం. ఐతే ఇన్నాళ్లు అతడి గురించి బయటికి ఏమీ మాట్లాడని పాయల్.. ఈ విషాద వేళ తనకు కాబోయే భర్త అతనని, తామిద్దరంలో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వెల్లడించింది.
This post was last modified on May 20, 2021 8:26 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…