ఒక సినిమాతో మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకున్న ఆ చిత్రంతో భారీ విజయాన్ని కూడా అందుకుంటే మళ్లీ ఆ కలయికలో సినిమా చూడాలని ప్రేక్షకులు ఆశపడతారు. దర్శక నిర్మాతలు కూడా ఆ కాంబినేషన్లను రిపీట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇలాంటి హిట్ కాంబినేషన్లు ఎన్నో చూశాం. ఇప్పుడు టాలీవుడ్లో మరో హిట్ పెయిర్ రిపీట్ కాబోతున్నట్లు సమాచారం. ఆ జంట వరుణ్ తేజ్-సాయిపల్లవిలదట.
వీళ్లిద్దరూ ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో సాయిపల్లవి చేసిన తొలి చిత్రమిది. అప్పటికే మలయాళంలో ‘ప్రేమమ్’తో భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న సాయిపల్లవి.. ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులనూ కట్టి పడేసింది. ఈ చిత్రంలో వరుణ్ సైతం పాత్రకు తగ్గట్లు చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. వరుణ్-సాయిపల్లవి జంట సినిమాలో చూడముచ్చటగా అనిపించింది.
ఐతే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు వరుణ్-సాయిపల్లవిల జోడీని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. యువ దర్శకుడు వెంకీ కుడుముల వీరి కలయికలో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. ఛలో, భీష్మ చిత్రాలతో మంచి విజయాలందుకున్న వెంకీ.. మూడో సినిమాను పట్టాలెక్కించడంలో కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు. ఈసారి పెద్ద స్టార్తో సినిమా కోసం ప్రయత్నించాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. అతడి మూడో సినిమా హీరోగా రకరకాల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటిదాకా అధికారిక సమాచారం ఏదీ లేదు.
ఐతే ఇప్పుడు వరుణ్ హీరోగా సినిమా చేయడానికి వెంకీ సిద్ధమవుతున్నాడని.. ఇందులో సాయిపల్లవి కథానాయిక అని ప్రచారం జరుగుతోంది. ఒక పేరున్న నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా ఉంటుందట. ప్రస్తుతం వరుణ్ ‘గని’ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది.
This post was last modified on May 17, 2021 2:12 pm
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…