అంతరిక్షం నేపథ్యంలో ప్రపంచ స్థాయిలో వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ఇండియాలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. తెలుగులోనూ స్పేస్ నేపథ్యంలో కొన్ని సినిమాలు చూశాం. చివరగా వరుణ్ తేజ్ హీరోగా ‘అంతరిక్షం’ పేరుతో ఓ సినిమా రావడం తెలిసిందే. హాలీవుడ్, ఇతర పరిశ్రమల్లో ఇలాంటి సినిమాలకు లెక్కే లేదు. ఐతే ఈ చిత్రాలన్నీ చూస్తున్నపుడు అంతరిక్షంలో ఉన్న భావనే కలుగుతుంది. కానీ వాస్తవానికి సెట్టింగ్స్ వేసి చిత్రీకరణ జరుపుతారు. గ్రాఫిక్స్ జోడించి మనకు అంతరిక్షంలో ఉన్న భావన కలిగిస్తారు. అంతే తప్ప అంతరిక్షం నేపథ్యంలో సినిమా అంటే అంతరిక్షానికి వెళ్లడం జరగదు. అదంతా ఎంతో ఖర్చుతో, సాహసంతో కూడుకున్న పని. స్పేస్ మీదికి వెళ్లేది సైంటిస్టులు మాత్రమే. కానీ ఇప్పుడు ఓ సినిమా కోసం చిత్ర బృందం అంతరిక్షంలోకి వెళ్లబోతుండటం.. అక్కడే చిత్రీకరణ జరపనుండటం విశేషం.
‘ఛాలెంజ్’ పేరుతో త్వరలోనే ఓ రష్యన్ సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలోపే జరపనున్నారట. ఇందుకోసం చిత్ర బృందంలో అందరూ శిక్షణ కూడా పొందారట. అందరూ కలిసి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే చిత్రీకరణ జరపనున్నారట. ఈ సినిమాను క్లిమ్ షిఫెన్కో అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్కాస్మోస్ త్వరలోనే అంతరిక్షంలో ఈ చిత్ర షూటింగ్ జరపనున్నామని ప్రకటించింది.
ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా చిత్ర బృందాన్ని అంతరిక్షంలోకి పంపి అప్పుడే సినిమాను లాంచ్ చేయబోతున్నారట. అప్పటి వరకు చిత్ర బృందంలోని ముఖ్యులకు ఓ స్పేస్ ఏజెన్సీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుందట. ఏడాది క్రితమే టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమాను అంతరిక్షంలో చిత్రీకరించబోతున్నట్టు నాసా పేర్కొంది. కానీ అనూహ్యంగా ఆగిపోయింది. అమెరికన్స్ వెనక్కి తగ్గిన ప్రయత్నాన్ని ఇప్పుడు రష్యన్లు నెత్తికెత్తుకోవడం విశేషం.
This post was last modified on May 17, 2021 9:09 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…