2020 జులై 30న రావాల్సిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ముందేమో షూటింగ్ ఆలస్యమవుతోందని ఆ డేట్ నుంచి 2021 జనవరి 8కి వాయిదా వేశారు. కానీ గత ఏడాది కరోనా వచ్చి షూటింగ్ ఆగిపోవడంతో ఆ డేట్ను మార్చక తప్పలేదు. మళ్లీ షూటింగ్ మొదలై జోరుగా పని నడిచాక చిత్ర బృందంలో కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్టోబరు 13న రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చారు.
ఈసారి బాగా ఆలోచించి, సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే విడుదల తేదీ ప్రకటించారు. కానీ ఆ డేట్ ఇచ్చాక పరిస్థితులు మళ్లీ ఇబ్బందికరంగా తయారయ్యాయి. షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం సాగలేదు. ఆలియా కరోనా బారిన పడటం సహా వేరే కారణాలు తోడయ్యాయి. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చి పడింది. షూటింగ్ ఆపేయక తప్పలేదు. చిత్ర బృందం ప్రకటించిన విడుదల తేదీకి ఇంకో ఐదు నెలలే మిగిలున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అది అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. వివిధ భాషలకు డబ్బింగ్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో అక్టోబరు 13 అనే కాదు.. ఈ ఏడాది చివరికి కూడా ‘ఆర్ఆర్ఆర్’ రాకపోవచ్చనే అభిప్రాయంతోనే అందరూ ఉన్నారు. కానీ ఈ చిత్ర కథానాయకుల్లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయడంపై ఆశావహ దృక్పథంతో ఉండటం విశేషం.
‘డెడ్ లైన్’ అనే అంతర్జాతీయ పబ్లిషింగ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ విశేషాలపై తారక్ మాట్లాడాడు. ఈ సినిమాకు సంబంధించి తమ ప్రయాణం 2018 నవంబరులో మొదలైందని.. ఐతే కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు తాము పని మానేసి ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. ఆ సమయాన్ని మినహాయిస్తే ఇప్పటిదాకా 19 నెలల పాటు ఈ సినిమా మీద పని చేశామని తారక్ తెలిపాడు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమాణాల ప్రకారం చూస్తే ఇంత సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదని.. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ ఘట్టాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని తారక్ అన్నాడు. అక్టోబరులో ఈ సినిమాను రిలీజ్ చేయడం పట్ల తాము ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తారక్ చెప్పడం విశేషం. తారక్ మాటలు నిజమై అక్టోబరు 13నే ‘ఆర్ఆర్ఆర్’ వచ్చేట్లయితే అంతకంటే మంచి వార్త మరేముంటుంది?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…
వెంకటేష్, అనిల్ రావిపూడి అయిదోసారి చేతులు కలిపిన మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెంకీకి తోడుగా కళ్యాణ్ రామ్…