మలయాళ కుట్టి సాయిపల్లవి సినిమాల ఎంపికలో ఎంత సెలెక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పాత్ర, కథ నచ్చకపోతే అది ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా తిరస్కరించేస్తుంటుంది. ఇలా ఆమె వదులుకున్న పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ నుంచి కూడా సాయిపల్లవి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ సినిమాను వదులుకోవడానికి కారణం పాత్ర, కథ నచ్చక కాదు. డేట్లు సర్దుబాటు చేయలేక.
ఇదిలా ఉంటే తాజాగా సాయిపల్లవి మరో సినిమాను తిరస్కరించినట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో నటించబోయే తొలి చిత్రం అయిన ‘ఛత్రపతి’ రీమేక్కు సాయిపల్లవి నో చెప్పిందట. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిని ఎంచుకోవాలని అనుకున్నారు దర్శక నిర్మాతలు.
కానీ శ్రీనివాస్ సరసన నటించడానికి కియారా అద్వానీ సహా కొందరు హీరోయిన్లు నో అనేశారు. భారీ పారితోషకం వారిని టెంప్ట్ చేయలేకపోయింది. ఐతే అక్కడ ప్రయత్నించి విఫలమయ్యాక సాయిపల్లవిని ఈ సినిమా కోసం అడిగితే ఆమె కుడా నో అనేసిందంటూ వార్తలు వస్తున్నాయి.
ఐతే ‘ఛత్రపతి’లో శ్రియ చేసిన హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అది ఫక్తు కమర్షియల్ సినిమాల్లో కనిపించే గ్లామర్ డాల్ పాత్ర. అలాంటి పాత్రను సాయిపల్లవి ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చేయలేదు. ఆమె చేసే అవకాశం కూడా లేదు. అసలే విషయం లేని పాత్ర. పైగా రీమేక్. అది కూడా చాలా పాత సినిమా. అందులోనూ తీస్తున్నది హిందీలో. అందులోనేమో శ్రీనివాస్ హీరో. ఇలాంటి సినిమాను సాయిపల్లవి ఎలా ఒప్పుకుంటుందసలు? సినిమా రేంజ్ గురించి కాకుండా పాత్ర గురించే ఆలోచించే ఆమెను ఇలాంటి సినిమాకు అడిగారంటేనే ఆశ్చర్యపోవాలి.
This post was last modified on May 12, 2021 5:56 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…