Movie News

కరోనాను తన్ని తరిమేసిన హీరోయిన్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా అంటే హీరోయిన్ పూజా హెగ్డేకు అస్సలు లెక్క లేనట్లుంది. అదంటే ఏమాత్రం భయం భక్తీ లేకుండా కామెంట్లు చేస్తోందామె. రెండు వారాల కిందట కరోనా బారిన పడి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేక ఐసొలేట్ అయిన పూజా.. ఇప్పుడు వైరస్ నుంచి కోలుకుందట. తనకు నెగెటివ్ కూడా వచ్చేసిందట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కరోనా గురించి కామెడీ చేస్తూ కామెంట్ పెట్టింది.

స్టుపిడ్ కరోనాను ముడ్డి మీద తన్ని తరిమేశా అంటూ ఆమె వ్యాఖ్యానించడం విశేషం. కరోనా నుంచి కోలుకున్న ఫొటోను కూడా షేర్ చేసిన పూజా.. తన కోసం అభిమానులు ఇచ్చిన ప్రేమ ద్వారా వచ్చిన శక్తే మ్యాజిక్ చేసిందని.. కాబట్టే త్వరగా కోలుకున్నానని పూజా వ్యాఖ్యానించింది. కరోనా కష్ట కాలంలో అందరూ ఇంటిపట్టునే ఉండాలని ఆమె అభిలషించింది.

పూజా కరోనా బారిన పడ్డ కొన్ని రోజులకే అల్లు అర్జున్ సైతం కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీనిపై పూజా స్పందిస్తూ.. అమూల్య (అల వైకుంఠపురములో తను పోషించిన పాత్ర పేరు)కు తోడుగా నిలవడానికి బంటూ (ఆ సినిమాలో బన్నీ పేరు) వచ్చాడంటూ తనదైన శైలిలో చమత్కరించింది. ఇప్పుడు పూజా నెగెటివ్‌గా తేలినట్లు వార్త పంచుకోగానే ఇంతకీ నీ కోసం కంపెనీ ఇచ్చిన బంటూ సంగతేంటి అని అభిమానులు అడుగుతుండటం విశేషం.

బహుశా బన్నీ కూడా తాను కోలుకుంటున్నట్లు ఇటీవలే అప్‌డేట్ ఇచ్చిన నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ‘నెగెటివ్’ వార్తతో అభిమానుల ముందుకు రావచ్చు. పూజా ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధేశ్యామ్’‌లతో పాటు తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాతో బిజీగా ఉంది. ఆమె చేతిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

This post was last modified on May 5, 2021 7:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

1 hour ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

3 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

4 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

6 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

6 hours ago