Movie News

రజినీకి మళ్లీ ఏమైంది?

సూపర్ స్టార్ రజినీకాంత్ కొంచెం గ్యాప్ తర్వాత ఇటీవల మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో అన్నాత్తె కోసం భారీ సన్నివేశాల చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ ఆలోచనను కూడా విరమించుకున్న సూపర్ స్టార్.. మధ్యలో వదిలేసిన ‘అన్నాత్తె’ చిత్రీకరణను మాత్రం కరోనా కష్ట కాలంలోనూ రిస్క్ చేసి మరీ పూర్తి చేయడానికి నడుం బిగించారు.

రామోజీ ఫిలిం సిటీలో రజినీ మీద భారీ యాక్షన్ ఘట్టాలు చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో చాలామందే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఆయన అమెరికాకు బయల్దేరుతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఆయనకు మళ్లీ ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తాయా అన్న ఆందోళన అభిమానుల్లో మొదలైంది. గత ఏడాది కూడా ఆయన అమెరికాకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

రజినీ ఆరోగ్యంగానే ఉన్నారని.. రెగ్యులర్ చెకప్‌ల కోసమే అమెరికాకు వెళ్లారని అంటున్నారు. మరి కొన్ని రోజుల తర్వాత యుఎస్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు పెడతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రజినీ కొంచెం ముందుగానే యుఎస్ చేరుకుంటున్నట్లు తెలిసింది. మూణ్నాలుగు వారాల పాటు అక్కడే ఉండి పరీక్షలు చేయించుకుని.. అంతా ఓకే అనుకున్నాక ఇండియాకు వస్తారట.

తనకున్న ఆరోగ్య సమస్యలకు తోడు.. కరోనా భయం కూడా ఉండటంతో రజినీ తన వెంటే ఓ వైద్య బృందాన్ని పెట్టుకుంటున్నారు. ఆయన షూటింగ్‌కు వెళ్లినపుడు కూడా వెంట ఆ బృందం ఉంటోంది. ఈ ఏడాది దీపావళికి ‘అన్నాత్తె’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే సంకల్పంతో రజినీ కష్టపడుతున్నారు. ఈ సినిమా పూర్తి చేశాక ఆయన పూర్తిగా విశ్రాంతికి పరిమితం కానున్నారు. కరోనా భయం పూర్తిగా తొలగిపోతే కానీ కొత్త సినిమా గురించి ఆలోచించే పరిస్థితి లేదు.

This post was last modified on May 5, 2021 6:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago