అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’కు పునాది పడి రెండేళ్లు దాటింది. ముందు మహేష్ బాబు కోసం ఈ కథను మొదలుపెట్టి.. తర్వాత దాన్ని అల్లు అర్జున్ కోసం మళ్లించాడు సుకుమార్. ‘రంగస్థలం’ తర్వాత తన నుంచి రాబోయే చిత్రం కావడంతో దీనిపై ఉన్న అంచనాలను అందుకోవడం కోసం కెరీర్లో మరే సినిమాకూ లేనంతగా ఈ స్క్రిప్టు మీద శ్రమించాడు సుకుమార్.
స్క్రిప్టు తయారవడంలో ఆలస్యానికి తోడు.. వేరే కారణాలు కూడా తోడై ఈ సినిమా పట్టాలెక్కడంలో, ఆ తర్వాత షూటింగ్ చేయడంలోనూ ఆలస్యం తప్పలేదు. గత కొన్ని నెలల్లో రెగ్యులర్ షూటింగ్ కొంచెం జోరుగా నడుస్తుంటే ఒకటికి రెండుసార్లు కరోనా కారణంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఒకసారి షూటింగ్ను ఆపి, పున:ప్రారంభించాక ఏం జరిగినా చిత్రీకరణ ఆపొద్దన్నట్లుగా పని కొనసాగించారు. చివరికి హీరో అల్లు అర్జునే కరోనా బారిన పడటం, మిగతా యూనిట్ సభ్యుల్లోనూ కొన్ని పాజిటివ్ కేసులు బయటపడటంతో చిత్రీకరణ ఆపక తప్పలేదు.
ఎన్ని రోజులు పని చేసినా, ఎంత కష్టపడ్డా కూడా ఇప్పటిదాకా సగం సినిమా కూడా అవ్వలేదు. ఇప్పుడే విలన్ పాత్ర రంగ ప్రవేశం చేయగా.. దాంతో ముడిపడ్డ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉన్నాయట. ఇందులో హీరో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్మగ్లర్ స్థాయికి ఎదిగే క్రమాన్ని కూడా భారీ లొకేషన్లలో చిత్రీకరించాల్సి ఉందట.
ఇప్పటిదాకా ఎక్కువగా ఒక పల్లెటూరి సెట్లో, అటవీ ప్రాంతంలో సన్నివేశాల చిత్రీకరణ సాగింది. అసలు కష్టమంతా ఇక మీదటే ఉందని.. చాలా లొకేషన్లు తిరగాల్సి ఉందని.. ఇండియాలో కరోనా విలయం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ అంత తేలిగ్గా తెగే వ్యవహారం కాదని.. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక సుకుమార్ తల పట్టుకుంటున్నాడని.. ఆగస్టు 13 సంగతలా ఉంచితే.. దసరాకు కూడా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు తక్కువే అని.. ఈ ఏడాది సినిమా రాకపోయినా ఆశ్చర్యం లేదని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి.
This post was last modified on May 5, 2021 2:04 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…