దక్షిణాదిన ట్రెండును ఫాలో కావడం కాకుండా ట్రెండ్ సృష్టించడానికి ప్రయత్నించే కథానాయికల్లో సమంత ఒకరు. వెబ్ సిరీస్లను ఇక్కడి సౌత్ హీరోయిన్లు కొంచెం తక్కువగా చూస్తున్న సమయంలో భవిష్యత్తు వాటిదే అని గుర్తించి రెండేళ్ల ముందే ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సెకండ్ సీజన్లో నటించడానికి ముందుకొచ్చిందామె. అందులో సమంతది నెగెటివ్ రోల్ కావడం విశేషం.
‘ఫ్యామిలీ మ్యాన్’ తొలి సీజన్ విశేషమైన ఆదరణ సంపాదించుకున్న నేపథ్యంలో రెండో సీజన్ కోసం ఏడాది కిందట్నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ కరోనా కారణంగా అది చిత్రీకరణ పూర్తి చేసుకోవడంలో ఆలస్యం జరిగింది. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. టీజర్ సైతం వదిలారు. కానీ అమేజాన్ ప్రైమ్ నిర్మించి ‘తాండవ్’ సిరీస్ వివాదంలో చిక్కుకోవడం, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అనుకోకుండా ఈ సిరీస్ విడుదలకు బ్రేక్ పడింది.
చూస్తుండగానే నెలలు గడిచిపోతున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సంగతేంటో తేలట్లేదు. థియేటర్లలో సినిమాలు లేక, ఓటీటీల్లో కొత్త కంటెంట్ లేక ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి టైంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రిలీజైతే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి ఈ సిరీస్ను రిలీజ్ చేయడంలో ఏం ఇబ్బందులు ఉన్నాయన్నది అర్థం కావడం లేదు. ఫిబ్రవరిలోనే ప్రిమియర్స్కు సన్నాహాలు చేశారు కాబట్టి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులేమీ పెండింగ్లో లేనట్లే. ఫస్ట్ కాపీ రెడీ అయినట్లే. ఇక వివాదాస్పద సన్నివేశాలు తీసేసి రీఎడిట్ చేసే పని ఏమైనా ఉందనుకున్నా.. అది కూడా ఈపాటికి పూర్తయ్యే ఉండాలి.
ఈ సిరీస్ మరీ ఇంత ఆలస్యం ప్రేక్షకులు ఏమాత్రం రుచించడం లేదు. లేటైతే అయ్యింది కానీ.. కనీసం ఫలానా టైంలో సిరీస్ను రిలీజ్ చేస్తాం అనే సంకేతాలు కూడా చిత్ర బృందం ఇవ్వడం లేదు. సమంతను టెర్రరిస్టుగా సంచలన పాత్రలో చూడ్డానికి ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు కానీ.. మరీ ఇలా జాప్యం చేస్తే ఆసక్తి సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను సాధ్యమైనంత త్వరగా బయటికి తెస్తే బెటర్.
This post was last modified on May 4, 2021 7:15 am
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…