దక్షిణాదిన ట్రెండును ఫాలో కావడం కాకుండా ట్రెండ్ సృష్టించడానికి ప్రయత్నించే కథానాయికల్లో సమంత ఒకరు. వెబ్ సిరీస్లను ఇక్కడి సౌత్ హీరోయిన్లు కొంచెం తక్కువగా చూస్తున్న సమయంలో భవిష్యత్తు వాటిదే అని గుర్తించి రెండేళ్ల ముందే ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సెకండ్ సీజన్లో నటించడానికి ముందుకొచ్చిందామె. అందులో సమంతది నెగెటివ్ రోల్ కావడం విశేషం.
‘ఫ్యామిలీ మ్యాన్’ తొలి సీజన్ విశేషమైన ఆదరణ సంపాదించుకున్న నేపథ్యంలో రెండో సీజన్ కోసం ఏడాది కిందట్నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ కరోనా కారణంగా అది చిత్రీకరణ పూర్తి చేసుకోవడంలో ఆలస్యం జరిగింది. చివరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. టీజర్ సైతం వదిలారు. కానీ అమేజాన్ ప్రైమ్ నిర్మించి ‘తాండవ్’ సిరీస్ వివాదంలో చిక్కుకోవడం, ‘ఫ్యామిలీ మ్యాన్-2’ విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అనుకోకుండా ఈ సిరీస్ విడుదలకు బ్రేక్ పడింది.
చూస్తుండగానే నెలలు గడిచిపోతున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సంగతేంటో తేలట్లేదు. థియేటర్లలో సినిమాలు లేక, ఓటీటీల్లో కొత్త కంటెంట్ లేక ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి టైంలో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రిలీజైతే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందనడంలో సందేహం లేదు. మరి ఈ సిరీస్ను రిలీజ్ చేయడంలో ఏం ఇబ్బందులు ఉన్నాయన్నది అర్థం కావడం లేదు. ఫిబ్రవరిలోనే ప్రిమియర్స్కు సన్నాహాలు చేశారు కాబట్టి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులేమీ పెండింగ్లో లేనట్లే. ఫస్ట్ కాపీ రెడీ అయినట్లే. ఇక వివాదాస్పద సన్నివేశాలు తీసేసి రీఎడిట్ చేసే పని ఏమైనా ఉందనుకున్నా.. అది కూడా ఈపాటికి పూర్తయ్యే ఉండాలి.
ఈ సిరీస్ మరీ ఇంత ఆలస్యం ప్రేక్షకులు ఏమాత్రం రుచించడం లేదు. లేటైతే అయ్యింది కానీ.. కనీసం ఫలానా టైంలో సిరీస్ను రిలీజ్ చేస్తాం అనే సంకేతాలు కూడా చిత్ర బృందం ఇవ్వడం లేదు. సమంతను టెర్రరిస్టుగా సంచలన పాత్రలో చూడ్డానికి ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు కానీ.. మరీ ఇలా జాప్యం చేస్తే ఆసక్తి సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను సాధ్యమైనంత త్వరగా బయటికి తెస్తే బెటర్.
This post was last modified on May 4, 2021 7:15 am
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…