Movie News

మెగా కుర్రాడి కోసం ఎంతమంది బాబోయ్

‘ఉప్పెన’ సినిమాతో సంచలన అరంగేట్రం చేశాడు మెగా ఫ్యామిలీ కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’కు సంబంధించి కొన్ని ప్రోమోలు చూస్తేనే అతడిలో మంచి విషయం ఉందని ఫిలిం మేకర్స్ గుర్తించారు. ఈ సినిమా విడుదలకు ముందే అతను క్రిష్ లాంటి అగ్ర దర్శకుడితో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడో ఆ సినిమా షూటింగ్ అయిపోయింది.

ఇంతలో ‘ఉప్పెన’ విడుదల కావడం, భారీ విజయాన్నందుకోవడం, వైష్ణవ్ పెర్ఫామెన్స్‌కు ప్రశంసలు దక్కడం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్లో అతను హాట్ షాట్ హీరో అయిపోయాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ దర్శకుడు గిరీశయ్యతో వైష్ణవ్ తన మూడో సినిమాను నెల కిందటే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మెగా కుర్రాడి కోసం మరింతమంది దర్శకులు, నిర్మాతలు లైన్లో ఉండటం విశేషం.

అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో వైష్ణవ్ సినిమా చేయబోతున్న సంగతి ఇంతకుముందు వెల్లడైంది. ఇక ప్రణవ్ అనే సుకుమార్ అసిస్టెంట్ ఒకరు.. వైష్ణవ్ తేజ్‌తో సినిమా కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు. వైష్ణవ్ డేట్లు సంపాదించిన ఓ నిర్మాత.. ఈ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి కథ సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో మంచి విజయాలందుకున్న వెంకీ కుడుముల సైతం వైష్ణవ్‌తో ఓ సినిమా కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్నది తాజా సమాచారం.

‘భీష్మ’ తర్వాత ఎవరైనా పెద్ద హీరోతో సినిమా చేద్దామని చూశాడతను. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. కాగా ఇప్పుడు వైష్ణవ్‌తో ఒక మంచి ఎంటర్టైనర్ చేయాలని చూస్తున్నాడట. కథ కూడా రెడీ అయిందని.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి, వైష్ణవ్‌కు స్క్రిప్టు వినిపించారని.. త్వరలోనే ఈ కలయికలో సినిమా మొదలయ్యే అవకాశముందని అంటున్నారు. మొత్తానికి ఒక సినిమా రిలీజ్‌తో వైష్ణవ్ ఇంత బిజీ అయిపోవడం, అతడి కోసం ఇంత మంది లైన్లో ఉండటం విశేషమే.

This post was last modified on May 4, 2021 7:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

47 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

49 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

4 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

9 hours ago