‘ఉప్పెన’ సినిమాతో సంచలన అరంగేట్రం చేశాడు మెగా ఫ్యామిలీ కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’కు సంబంధించి కొన్ని ప్రోమోలు చూస్తేనే అతడిలో మంచి విషయం ఉందని ఫిలిం మేకర్స్ గుర్తించారు. ఈ సినిమా విడుదలకు ముందే అతను క్రిష్ లాంటి అగ్ర దర్శకుడితో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడో ఆ సినిమా షూటింగ్ అయిపోయింది.
ఇంతలో ‘ఉప్పెన’ విడుదల కావడం, భారీ విజయాన్నందుకోవడం, వైష్ణవ్ పెర్ఫామెన్స్కు ప్రశంసలు దక్కడం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్లో అతను హాట్ షాట్ హీరో అయిపోయాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ దర్శకుడు గిరీశయ్యతో వైష్ణవ్ తన మూడో సినిమాను నెల కిందటే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మెగా కుర్రాడి కోసం మరింతమంది దర్శకులు, నిర్మాతలు లైన్లో ఉండటం విశేషం.
అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడితో వైష్ణవ్ సినిమా చేయబోతున్న సంగతి ఇంతకుముందు వెల్లడైంది. ఇక ప్రణవ్ అనే సుకుమార్ అసిస్టెంట్ ఒకరు.. వైష్ణవ్ తేజ్తో సినిమా కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు. వైష్ణవ్ డేట్లు సంపాదించిన ఓ నిర్మాత.. ఈ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి కథ సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో మంచి విజయాలందుకున్న వెంకీ కుడుముల సైతం వైష్ణవ్తో ఓ సినిమా కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్నది తాజా సమాచారం.
‘భీష్మ’ తర్వాత ఎవరైనా పెద్ద హీరోతో సినిమా చేద్దామని చూశాడతను. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. కాగా ఇప్పుడు వైష్ణవ్తో ఒక మంచి ఎంటర్టైనర్ చేయాలని చూస్తున్నాడట. కథ కూడా రెడీ అయిందని.. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి, వైష్ణవ్కు స్క్రిప్టు వినిపించారని.. త్వరలోనే ఈ కలయికలో సినిమా మొదలయ్యే అవకాశముందని అంటున్నారు. మొత్తానికి ఒక సినిమా రిలీజ్తో వైష్ణవ్ ఇంత బిజీ అయిపోవడం, అతడి కోసం ఇంత మంది లైన్లో ఉండటం విశేషమే.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…