‘మే డే’..అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. అనేక దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. శ్రమదోపిడిని నిరసిస్తూ..యావత్ ప్రపంచ కార్మికుల్లో స్పూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగే ‘మేడే’ కావటంతో అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఇదొక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలోని కొందరు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించిన రోజు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు . తమ శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయని శ్రామికులు గొంతెత్తిన రోజు. ఈ రోజుని తలుచుకోగానే తెలుగువారికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి గుర్తు వస్తారు.
సమాజ గతిని, పురోగతిని శాసించి, నిర్ధేశించే శ్రామిక వర్గం తరుపున వకల్తా పుచ్చుకున్నట్లు ఉంటాయి ఆయన సినిమాలు. ఆయన దర్శకత్వంలో శ్రామిక వర్గం కష్టాలు, హక్కులపై తెలుగు చాలా సినిమాలు వచ్చాయి. దాదాపు ఆర్ నారాయణ మూర్తి సినిమాలన్నీ శ్రామికుల హక్కులకు సంబంధించినవే. ఆయన సినిమాల్లో పాటలు కూడా కార్మికుల,కర్షకుల కష్టాలను తెలియజేసేవిగా ఉంటాయి. అందుకే మేడే సందర్భంగా తెలుగు టీవి ఛానెల్స్ లో పోగ్రామ్ లు వేస్తే ఖచ్చితంగా ఆర్ .నారాయణ మూర్తి పాటలు, డైలాగులు ఉండి తీరతాయి.
ఆర్.నారాయణ మూర్తి గత కొంతకాలంగా సినిమాల జోరు తగ్గించారు. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతానని తెలిసింది. సామాజిక అంశాల ఆధారంగా సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుందన్నారు. కరోనా చిత్ర పరిశ్రమంపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఈ కారణంగా సినిమా నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. తాను తీయబోయే సినిమాను విశాఖ, విజయనగరం జిల్లాల్లో చిత్రీకరిస్తానని తెలిపారు.
This post was last modified on May 1, 2021 3:03 pm
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…
దేశ రాజధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్రమేనని అందరికీ తెలిసిందే. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…
ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…