డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లెక్కే వేరు. తన కథపై పూర్తి క్లారిటీతో ఉంటాడు. అందుకే వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసి క్వాలిటీ అవుట్ పుట్ తీసుకువస్తాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ ‘లైగర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరో. తన తదుపరి చిత్రం ఏంటో పూరి ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ కోసం ముందుగా ఎంపిక చేసుకుంది పూరి జగన్నాధ్ నే. పూరి చాలా సంతోషంతో మెగాస్టార్ కోసం మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ‘ఆటో జానీ’ కథ సిద్ధం చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో చిరు ఈ కథని రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ మిస్ కావడంతో పూరి బాగా నిరాశపడ్డాడు. ఆటో జానీ కథ అలాగే ఉండిపోయింది.
ఆటో జానీ కథని మరో హీరోతో తెరకెక్కించేందుకు పూరి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు.. మాస్ మహారాజ్ రవితేజ. రవితేజకు కూడా ఈ కథ బాగా సెట్ అవుతుందని.. కొంచెం మార్పులు చేస్తే సరిపోతుందని పూరి భావిస్తున్నాడట. లైగర్ పూర్తయ్యాక ఆటో జానీపై పూరి ఫోకస్ పెట్టనున్నట్లు టాక్.
పూరి అడిగితే రవితేజ కాదనడం అంటూ ఉండదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు ఇలా ఐదు చిత్రాలు వచ్చాయి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…