కమెడియన్ పొట్టి వీరయ్య గుండెపోటుతో మరణించిన మరుసటి రోజే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి విషాదానికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మారి ధాటికి రచయిత, దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ ప్రాణాలు వదిలాడు. ఆయన వయసు 57 ఏళ్లు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు సాయి బాలాజీ దర్శకత్వం వహించాడు.
ఉదయ్ కిరణ్ చివరి సినిమా జై శ్రీరామ్ సైతం సాయిబాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిందే. సాయిబాలాజీ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ బావగారూ బాగున్నారా స్క్రీన్ ప్లే రచయితల్లో ఒకరు కావడం విశేషం. సినిమాల్లో అవకాశాలు తగ్గాక సాయి బాలాజీ టీవీ సీరియళ్లకు పని చేశాడు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’.. వంటి సీరియళ్లకు ఆయన దర్శకత్వం వహించాడు.
సాయి బాలాజీతో పాటు ఆయన భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత పది రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. భార్య, కుమార్తె కోలుకున్నప్పటికీ.. సాయిబాలాజీ పరిస్థితి మాత్రం విషమించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయిబాలాజీ మృతి చెందాడు. సాయిబాలాజీ స్వస్థలం తిరుపతి. సినిమాల మీద ఆసక్తితో టాలీవుడ్లోకి అడుగు పెట్టి రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఆ తర్వాత శివాజీ సినిమాతో దర్శకుడిగా మారారు. సాయిబాలాజీ మరణవార్త తెలిసిన సినీ, టీవీ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గత ఏడాది కాలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే.
This post was last modified on April 26, 2021 9:25 pm
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…