కమెడియన్ పొట్టి వీరయ్య గుండెపోటుతో మరణించిన మరుసటి రోజే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి విషాదానికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మారి ధాటికి రచయిత, దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ ప్రాణాలు వదిలాడు. ఆయన వయసు 57 ఏళ్లు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు సాయి బాలాజీ దర్శకత్వం వహించాడు.
ఉదయ్ కిరణ్ చివరి సినిమా జై శ్రీరామ్ సైతం సాయిబాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిందే. సాయిబాలాజీ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ బావగారూ బాగున్నారా స్క్రీన్ ప్లే రచయితల్లో ఒకరు కావడం విశేషం. సినిమాల్లో అవకాశాలు తగ్గాక సాయి బాలాజీ టీవీ సీరియళ్లకు పని చేశాడు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’.. వంటి సీరియళ్లకు ఆయన దర్శకత్వం వహించాడు.
సాయి బాలాజీతో పాటు ఆయన భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత పది రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. భార్య, కుమార్తె కోలుకున్నప్పటికీ.. సాయిబాలాజీ పరిస్థితి మాత్రం విషమించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయిబాలాజీ మృతి చెందాడు. సాయిబాలాజీ స్వస్థలం తిరుపతి. సినిమాల మీద ఆసక్తితో టాలీవుడ్లోకి అడుగు పెట్టి రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఆ తర్వాత శివాజీ సినిమాతో దర్శకుడిగా మారారు. సాయిబాలాజీ మరణవార్త తెలిసిన సినీ, టీవీ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గత ఏడాది కాలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే.
This post was last modified on April 26, 2021 9:25 pm
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…
రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…