కమెడియన్ పొట్టి వీరయ్య గుండెపోటుతో మరణించిన మరుసటి రోజే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి విషాదానికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మారి ధాటికి రచయిత, దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ ప్రాణాలు వదిలాడు. ఆయన వయసు 57 ఏళ్లు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు సాయి బాలాజీ దర్శకత్వం వహించాడు.
ఉదయ్ కిరణ్ చివరి సినిమా జై శ్రీరామ్ సైతం సాయిబాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిందే. సాయిబాలాజీ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ బావగారూ బాగున్నారా స్క్రీన్ ప్లే రచయితల్లో ఒకరు కావడం విశేషం. సినిమాల్లో అవకాశాలు తగ్గాక సాయి బాలాజీ టీవీ సీరియళ్లకు పని చేశాడు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’.. వంటి సీరియళ్లకు ఆయన దర్శకత్వం వహించాడు.
సాయి బాలాజీతో పాటు ఆయన భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత పది రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. భార్య, కుమార్తె కోలుకున్నప్పటికీ.. సాయిబాలాజీ పరిస్థితి మాత్రం విషమించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయిబాలాజీ మృతి చెందాడు. సాయిబాలాజీ స్వస్థలం తిరుపతి. సినిమాల మీద ఆసక్తితో టాలీవుడ్లోకి అడుగు పెట్టి రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఆ తర్వాత శివాజీ సినిమాతో దర్శకుడిగా మారారు. సాయిబాలాజీ మరణవార్త తెలిసిన సినీ, టీవీ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గత ఏడాది కాలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే.
This post was last modified on April 26, 2021 9:25 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…