Movie News

క‌రోనాతో టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మృతి

క‌మెడియ‌న్ పొట్టి వీర‌య్య గుండెపోటుతో మ‌ర‌ణించిన మ‌రుస‌టి రోజే టాలీవుడ్లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఈసారి విషాదానికి కార‌ణం క‌రోనా వైర‌స్. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు సాయి బాలాజీ ప్ర‌సాద్ ప్రాణాలు వ‌దిలాడు. ఆయ‌న వ‌య‌సు 57 ఏళ్లు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు సాయి బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఉద‌య్ కిర‌ణ్ చివ‌రి సినిమా జై శ్రీరామ్ సైతం సాయిబాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిందే. సాయిబాలాజీ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బావ‌గారూ బాగున్నారా స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌ల్లో ఒక‌రు కావ‌డం విశేషం. సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాక సాయి బాలాజీ టీవీ సీరియ‌ళ్ల‌కు పని చేశాడు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’.. వంటి సీరియళ్లకు ఆయన దర్శకత్వం వహించాడు.

సాయి బాలాజీతో పాటు ఆయ‌న‌ భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ప‌ది రోజుల కింద‌ట క‌రోనా బారిన ప‌డ్డారు. భార్య‌, కుమార్తె కోలుకున్న‌ప్ప‌టికీ.. సాయిబాలాజీ ప‌రిస్థితి మాత్రం విష‌మించింది. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం సాయిబాలాజీ మృతి చెందాడు. సాయిబాలాజీ స్వ‌స్థ‌లం తిరుప‌తి. సినిమాల మీద ఆస‌క్తితో టాలీవుడ్లోకి అడుగు పెట్టి రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.

ఆ త‌ర్వాత శివాజీ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. సాయిబాలాజీ మరణవార్త తెలిసిన సినీ, టీవీ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గ‌త ఏడాది కాలంలో ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం స‌హా వివిధ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌లైన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on April 26, 2021 9:25 pm

Share

Recent Posts

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

3 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

3 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

3 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

4 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

4 hours ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

4 hours ago