Movie News

క‌రోనాతో టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మృతి

క‌మెడియ‌న్ పొట్టి వీర‌య్య గుండెపోటుతో మ‌ర‌ణించిన మ‌రుస‌టి రోజే టాలీవుడ్లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఈసారి విషాదానికి కార‌ణం క‌రోనా వైర‌స్. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు సాయి బాలాజీ ప్ర‌సాద్ ప్రాణాలు వ‌దిలాడు. ఆయ‌న వ‌య‌సు 57 ఏళ్లు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు సాయి బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఉద‌య్ కిర‌ణ్ చివ‌రి సినిమా జై శ్రీరామ్ సైతం సాయిబాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిందే. సాయిబాలాజీ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బావ‌గారూ బాగున్నారా స్క్రీన్ ప్లే ర‌చ‌యిత‌ల్లో ఒక‌రు కావ‌డం విశేషం. సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాక సాయి బాలాజీ టీవీ సీరియ‌ళ్ల‌కు పని చేశాడు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’.. వంటి సీరియళ్లకు ఆయన దర్శకత్వం వహించాడు.

సాయి బాలాజీతో పాటు ఆయ‌న‌ భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ప‌ది రోజుల కింద‌ట క‌రోనా బారిన ప‌డ్డారు. భార్య‌, కుమార్తె కోలుకున్న‌ప్ప‌టికీ.. సాయిబాలాజీ ప‌రిస్థితి మాత్రం విష‌మించింది. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం సాయిబాలాజీ మృతి చెందాడు. సాయిబాలాజీ స్వ‌స్థ‌లం తిరుప‌తి. సినిమాల మీద ఆస‌క్తితో టాలీవుడ్లోకి అడుగు పెట్టి రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.

ఆ త‌ర్వాత శివాజీ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. సాయిబాలాజీ మరణవార్త తెలిసిన సినీ, టీవీ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గ‌త ఏడాది కాలంలో ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం స‌హా వివిధ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌లైన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on April 26, 2021 9:25 pm

Share

Recent Posts

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

1 hour ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

2 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

3 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

3 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

6 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

7 hours ago