కమెడియన్ పొట్టి వీరయ్య గుండెపోటుతో మరణించిన మరుసటి రోజే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి విషాదానికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మారి ధాటికి రచయిత, దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ ప్రాణాలు వదిలాడు. ఆయన వయసు 57 ఏళ్లు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు సాయి బాలాజీ దర్శకత్వం వహించాడు.
ఉదయ్ కిరణ్ చివరి సినిమా జై శ్రీరామ్ సైతం సాయిబాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిందే. సాయిబాలాజీ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ బావగారూ బాగున్నారా స్క్రీన్ ప్లే రచయితల్లో ఒకరు కావడం విశేషం. సినిమాల్లో అవకాశాలు తగ్గాక సాయి బాలాజీ టీవీ సీరియళ్లకు పని చేశాడు. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’.. వంటి సీరియళ్లకు ఆయన దర్శకత్వం వహించాడు.
సాయి బాలాజీతో పాటు ఆయన భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత పది రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. భార్య, కుమార్తె కోలుకున్నప్పటికీ.. సాయిబాలాజీ పరిస్థితి మాత్రం విషమించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయిబాలాజీ మృతి చెందాడు. సాయిబాలాజీ స్వస్థలం తిరుపతి. సినిమాల మీద ఆసక్తితో టాలీవుడ్లోకి అడుగు పెట్టి రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఆ తర్వాత శివాజీ సినిమాతో దర్శకుడిగా మారారు. సాయిబాలాజీ మరణవార్త తెలిసిన సినీ, టీవీ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గత ఏడాది కాలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారికి బలైన సంగతి తెలిసిందే.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…