సూర్య తమ్ముడు అనే ట్యాగ్ను తన తొలి సినిమా ‘పరుత్తి వీరన్’ విడుదల కావడానికి ముందు మాత్రమే ఉపయోగించుకున్నాడు కార్తి. ఆ సినిమా రిలీజ్ కావడం ఆలస్యం.. కార్తికి సొంత గుర్తింపు వచ్చింది. అతడే స్థాయే మారిపోయింది. తొలి సినిమాలోనే అద్భుత నటన కనబరచడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కార్తి వెనుదిరిగి చూసుకోలేదు. కార్తి అరంగేట్రం చేసేసరికి సూర్య పెద్ద స్టార్ కాగా.. కొన్నేళ్లలోనే అన్నను మించి భారీ చిత్రాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు కార్తి.
యుగానికి ఒక్కడు, కాష్మోరా, ఖాకి లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఇటీవలే విడుదలైన ‘సుల్తాన్’ సైతం భారీ చిత్రమే. అతడి మీద రూ.40-50 కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటే, భారీ కథలను దర్శకులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కార్తి మరో మెగా మూవీకి శ్రీకారం చుట్టాడు. ఇది అతడి కెరీర్లో మరో భారీ చిత్రం అయ్యేలా ఉంది.
సర్దార్.. ఇదీ కార్తి కొత్త సినిమా పేరు. ఇరుంబు తిరై/అభిమన్యుడు సినిమాతో అరంగేట్రంలోనే అదరగొట్టిన మిత్రన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ రోజే టైటిల్, ఫస్ట్లుక్తో కూడిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూస్తే సినిమా రేంజే వేరుగా ఉండబోతోందని అర్థమవుతోంది. మోషన్ పోస్టర్లో భాగంగా మ్యాప్లో చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలను చూపించడం విశేషం. భారీగా జుట్టు, గడ్డంతో కార్తి లుక్ సైతం చాలా కొత్తగా ఉంది.
ఇప్పటిదాకా లోకల్ కథలే చేసిన కార్తి.. ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్లబోతున్నట్లు మోసణ్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్తో మోషన్ పోస్టర్ను ఎలివేట్ చేశాడు. ‘అభిమన్యుడు’ తర్వాత మిత్రన్ తీసిన రెండో సినిమా ‘హీరో’ సైతం హిట్టయింది. దీంతో కార్తి హీరోగా అతను చేయబోయే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on April 26, 2021 8:12 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…