సూర్య తమ్ముడు అనే ట్యాగ్ను తన తొలి సినిమా ‘పరుత్తి వీరన్’ విడుదల కావడానికి ముందు మాత్రమే ఉపయోగించుకున్నాడు కార్తి. ఆ సినిమా రిలీజ్ కావడం ఆలస్యం.. కార్తికి సొంత గుర్తింపు వచ్చింది. అతడే స్థాయే మారిపోయింది. తొలి సినిమాలోనే అద్భుత నటన కనబరచడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో కార్తి వెనుదిరిగి చూసుకోలేదు. కార్తి అరంగేట్రం చేసేసరికి సూర్య పెద్ద స్టార్ కాగా.. కొన్నేళ్లలోనే అన్నను మించి భారీ చిత్రాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు కార్తి.
యుగానికి ఒక్కడు, కాష్మోరా, ఖాకి లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఇటీవలే విడుదలైన ‘సుల్తాన్’ సైతం భారీ చిత్రమే. అతడి మీద రూ.40-50 కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటే, భారీ కథలను దర్శకులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కార్తి మరో మెగా మూవీకి శ్రీకారం చుట్టాడు. ఇది అతడి కెరీర్లో మరో భారీ చిత్రం అయ్యేలా ఉంది.
సర్దార్.. ఇదీ కార్తి కొత్త సినిమా పేరు. ఇరుంబు తిరై/అభిమన్యుడు సినిమాతో అరంగేట్రంలోనే అదరగొట్టిన మిత్రన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ రోజే టైటిల్, ఫస్ట్లుక్తో కూడిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూస్తే సినిమా రేంజే వేరుగా ఉండబోతోందని అర్థమవుతోంది. మోషన్ పోస్టర్లో భాగంగా మ్యాప్లో చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలను చూపించడం విశేషం. భారీగా జుట్టు, గడ్డంతో కార్తి లుక్ సైతం చాలా కొత్తగా ఉంది.
ఇప్పటిదాకా లోకల్ కథలే చేసిన కార్తి.. ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్కు వెళ్లబోతున్నట్లు మోసణ్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్తో మోషన్ పోస్టర్ను ఎలివేట్ చేశాడు. ‘అభిమన్యుడు’ తర్వాత మిత్రన్ తీసిన రెండో సినిమా ‘హీరో’ సైతం హిట్టయింది. దీంతో కార్తి హీరోగా అతను చేయబోయే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on April 26, 2021 8:12 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…