బాహుబలికి ముందు ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్. ఆ సమయానికి ప్రభాస్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అదే. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవడం విశేషం. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. అతడి సినిమాల స్థాయే వేరు. కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్ గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడట్లేదు. పదో వార్షికోత్సవం సందర్భంగా దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు.
హీరో సహా మెయిన్ కాస్ట్ అండ్ క్రూలో ఎవరూ ఈ సినిమాను గుర్తు చేసుకున్నట్లు కనిపించలేదు. కానీ అందులో ఓ చిన్న పాత్ర చేసిన నటుడు మాత్రం ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఆ చిన్న పాత్రతో మొదలైన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుని పొంగిపోయాడు. అతనెవరో కాదు.. యువ కథానాయకుడు సత్యదేవ్.
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో, చిన్న అవకాశం వస్తే చాలనుకున్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి పెద్ద సినిమాలో ప్రభాస్ ఫ్రెండుగా నటించే అవకాశం రావడంతో సత్యదేవ్ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఆ సమయానికి ఎవరూ అతణ్ని గుర్తు పెట్టుకోలేదు. ఆ పాత్ర గురించి మాట్లాడుకోలేదు. తర్వాత ఇలాంటి చిన్న పాత్రలు మరి కొన్ని చేశాడు. కొన్నేళ్లకు పూరి జగన్నాథ్ జ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మికి జోడీగా కీలక పాత్ర ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని తన సత్తా ఏంటో చూపించాడు సత్యదేవ్.
గత కొన్నేళ్లలో సత్యదేవ్ సినిమాల్లో ఏవి ఎలా ఆడాయన్నది పక్కన పెడితే.. ప్రతి పాత్రతోనూ నటుడిగా అతను తన ప్రతిభను చాటుకున్నాడు. గత ఏడాది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో నటుడిగా మరిన్ని మెట్లు ఎక్కాడు. ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, తిమ్మరసు లాంటి ఆసక్తికర సినిమాల్లో నటిస్తున్నాడు సత్యదేవ్. తాను నటుడిగా అరంగేట్రం చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ విడుదలై పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ సినిమాలోని ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు తన ప్రయాణానికి తోడ్పడ్డ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఒక భావోద్వేగ పోస్టు పెట్టాడు సత్యదేవ్.
This post was last modified on April 24, 2021 9:55 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…