కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలు చేసినా.. వాటితో మంచి ఫలితాలు అందుకుంటే ఆటోమేటిగ్గా పెద్ద సినిమాలు చేసే అవకాశం వస్తుంది. స్టార్ హీరోలు పిలిచి అవకాశం ఇస్తారు. ఇలాంటి అవకాశాలు చాలామంది జీవితాలను మార్చేస్తుంటాయి. ఒక్కసారిగా రేంజ్ మారిపోతుంటుంది. అందుకే ఇలాంటి ‘ఒక్క ఛాన్స్’ కోసం చాలామంది యువ దర్శకులు ఎదురు చూస్తుంటారు.
‘అహనా పెళ్లంట’ అనే కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి మంచి విజయాన్నందుకుని.. ఆ తర్వాత ‘పూల రంగడు’ చిత్రంతో మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న వీరభద్రం చౌదరి కూడా అప్పట్లో ఓ పెద్ద అవకాశం కోసం ఎదురు చూశాడు. కొత్త, వర్ధమాన దర్శకులను బాగా ప్రోత్సహించే అక్కినేని నాగార్జున అతడికి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. హీరోగా నటిస్తూ సొంత బేనర్లో సినిమాను నిర్మించాడు. ఆ చిత్రమే.. భాయ్.
మూడో సినిమాకే నాగార్జున లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిందని వీరభద్రం ఎంత మురిసిపోయాడో? కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణ ఫలితాన్నందుకుంది. దెబ్బకు వీరభద్రం ఆకాశం నుంచి నేల మీద పడ్డాడు. స్వయంగా నాగార్జున ఈ సినిమా గురించి రిలీజ్ తర్వాత ప్రతికూల వ్యాఖ్యలు చేయడం, తనను ఇష్టపడేవాళ్లు ఈ సినిమా చూడొద్దని ఓ సందర్భంలో అనడం వీరభద్రం కెరీర్కు బాగానే డ్యామేజ్ చేసింది. అతడికి తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఆదితో ‘చుట్టాలబ్బాయి’ అనే సినిమా చేస్తే అదంత మంచి ఫలితాన్నివ్వలేదు. మళ్లీ ఇంకో అవకాశం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు వీరభద్రం.
మధ్యలో రాజశేఖర్తో ఓ సినిమా ఓకే అయినట్లే అయి క్యాన్సిల్ అయింది. ఇంకే పేరున్న హీరో కూడా అతడితో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఆదితో ఓ సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. కానీ ఆది పరిస్థితేంటో తెలిసిందే. అతను విజయానికి ముఖం వాచిపోయి ఉన్నాడు. మార్కెట్ జీరో అయిపోయింది. ఇలాంటి హీరోతో వీరభద్రం లాంటి దర్శకుడు ఈ దశలో ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి. మొత్తానికి ‘భాయ్’ అనే సినిమా తన కెరీర్ను ఈ స్థాయికి తీసుకొస్తుందని వీరభద్రం ఊహించి ఉండడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…