అనుకున్నదే అయింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లలో ప్రేక్షకుల పరిమితిని 50 శాతానికి తగ్గించేశారు. కేవలం ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తే సరిపోదు. థియేటర్లలో ప్రేక్షకులు ఎలా పడితే అలా కూర్చోవడానికి వీల్లేదు. ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీ ఉంచాల్సిందే. ఈ విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాల నుంచి థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు అందాయి.
గత రెండు మూడు వారాల్లో దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి అమాంతం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు. ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక అవ్వగానే థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడంతో పాటు అనేక షరతులు పెడతారన్న సంకేతాలు కొన్ని రోజుల ముందు నుంచే వస్తున్నాయి. ఇప్పుడు లాంఛనంగా ఆ నిర్ణయాన్ని అమల్లో పెట్టారు. మరోవైపు ఏపీలో విద్యా సంస్థలన్నింటినీ మూసి వేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే పాఠశాలలన్నింటినీ మూసి వేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో సైతం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అవ్వగానే థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడంతో పాటు మరిన్ని షరతులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై కొన్ని రోజుల ముందే సంకేతాలు రావడంతోనే వకీల్ సాబ్ తర్వాత షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలను వాయిదా వేయడం మొదలైంది. ఏపీలో టికెట్ల ధరలపై నియంత్రణ నేపథ్యంలో చాలా చోట్ల థియేటర్లను ఇప్పటికే స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. ఇక ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం, పేరున్న సినిమాలు లేకపోవడంతో మరిన్ని థియేటర్లు మూత పడటం ఖాయంగా కనిపిస్తోంది.
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…