అనుకున్నదే అయింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని థియేటర్లలో ప్రేక్షకుల పరిమితిని 50 శాతానికి తగ్గించేశారు. కేవలం ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గిస్తే సరిపోదు. థియేటర్లలో ప్రేక్షకులు ఎలా పడితే అలా కూర్చోవడానికి వీల్లేదు. ప్రతి రెండు సీట్ల మధ్య ఒక సీటు ఖాళీ ఉంచాల్సిందే. ఈ విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాల నుంచి థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు అందాయి.
గత రెండు మూడు వారాల్లో దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి అమాంతం పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు. ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక అవ్వగానే థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడంతో పాటు అనేక షరతులు పెడతారన్న సంకేతాలు కొన్ని రోజుల ముందు నుంచే వస్తున్నాయి. ఇప్పుడు లాంఛనంగా ఆ నిర్ణయాన్ని అమల్లో పెట్టారు. మరోవైపు ఏపీలో విద్యా సంస్థలన్నింటినీ మూసి వేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే పాఠశాలలన్నింటినీ మూసి వేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో సైతం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అవ్వగానే థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడంతో పాటు మరిన్ని షరతులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై కొన్ని రోజుల ముందే సంకేతాలు రావడంతోనే వకీల్ సాబ్ తర్వాత షెడ్యూల్ అయిన పేరున్న సినిమాలను వాయిదా వేయడం మొదలైంది. ఏపీలో టికెట్ల ధరలపై నియంత్రణ నేపథ్యంలో చాలా చోట్ల థియేటర్లను ఇప్పటికే స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు. ఇక ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం, పేరున్న సినిమాలు లేకపోవడంతో మరిన్ని థియేటర్లు మూత పడటం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 20, 2021 9:01 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…