నెల రోజుల ముందు కరోనా గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. మళ్లీ కేసులు పెరుగుతున్నాయి అన్నా కూడా ఎవరిలోనూ పెద్దగా భయం కనిపించలేదు. గత ఏడాది ఇదే సమయానికి కొవిడ్ భయంతో వణికిపోయిన జనాలు.. ఆరు నెలలు గడిచాక వైరస్ను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ షరతులన్నీ పక్కకు పోయాయి. అన్ని కార్యకలాపాలూ యధావిధిగా నడవడం మొదలయ్యాయి. కరోనా కేసులు కూడా రోజు రోజుకూ తగ్గుతూ వెళ్లడంతో ఇక గండం గట్టెక్కినట్లే అనుకున్నారు. ఒక దశ దాటాక కరోనా గురించి చర్చే లేకపోయింది.
తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా కరోనా ప్రభావం నుంచి బయటపడి మునుపటి స్థాయిలో నడవడం మొదలైంది. షూటింగ్స్ జోరుగా సాగాయి. థియేటర్లలో సినిమాలు 100 శాతం ఆక్యుపెన్సీతో నడవడం మొదలయ్యాయి. ఇక ఇండస్ట్రీకి ఏ బాధా లేదనే అనుకున్నారంతా.
కానీ గత నెల రోజుల వ్యవధిలో మొత్తం కథ మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి ఊహించని స్థాయికి చేరింది. కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. గత ఏడాది పీక్ స్టేజ్ అనుకున్న దాన్ని మించిపోయి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. ఇక ఎప్పటికీ గత ఏడాది చూసిన కష్ట కాలం రాదనుకుంటే.. మళ్లీ అవే పరిస్థితులు దాదాపు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ పెట్టకపోవచ్చు కానీ.. జనాలు జాగ్రత్త పడకుంటే, స్వీయ నియంత్రణ పాటించకుంటే దారుణాలు చూడక తప్పేట్లు లేదు.
ఈ నేపథ్యంలో త్వరలోనే థియేటర్లపై మళ్లీ ఆంక్షలు తప్పవంటున్నారు. షూటింగ్స్ సజావుగా సాగడమూ కష్టంగానే ఉంది. ప్రభుత్వం ఆదేశించడానికి ముందే పరిశ్రమ పెద్దలు దీని గురించి అంతర్గతంగా చర్చించి షూటింగ్స్ ఆపేయాలని చూస్తున్నారట. ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల షూటింగ్స్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇలా ఎవరికి వారు షూటింగ్స్ ఆపడం కష్టమని.. కాబట్టి ఇండస్ట్రీ తరఫున ఓ నిర్ణయం తీసుకుని, షూటింగ్స్ ఆపించేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ మేరకు నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు.
This post was last modified on April 17, 2021 1:44 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…