నెల రోజుల ముందు కరోనా గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. మళ్లీ కేసులు పెరుగుతున్నాయి అన్నా కూడా ఎవరిలోనూ పెద్దగా భయం కనిపించలేదు. గత ఏడాది ఇదే సమయానికి కొవిడ్ భయంతో వణికిపోయిన జనాలు.. ఆరు నెలలు గడిచాక వైరస్ను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ షరతులన్నీ పక్కకు పోయాయి. అన్ని కార్యకలాపాలూ యధావిధిగా నడవడం మొదలయ్యాయి. కరోనా కేసులు కూడా రోజు రోజుకూ తగ్గుతూ వెళ్లడంతో ఇక గండం గట్టెక్కినట్లే అనుకున్నారు. ఒక దశ దాటాక కరోనా గురించి చర్చే లేకపోయింది.
తెలుగు సినీ పరిశ్రమ పూర్తిగా కరోనా ప్రభావం నుంచి బయటపడి మునుపటి స్థాయిలో నడవడం మొదలైంది. షూటింగ్స్ జోరుగా సాగాయి. థియేటర్లలో సినిమాలు 100 శాతం ఆక్యుపెన్సీతో నడవడం మొదలయ్యాయి. ఇక ఇండస్ట్రీకి ఏ బాధా లేదనే అనుకున్నారంతా.
కానీ గత నెల రోజుల వ్యవధిలో మొత్తం కథ మారిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి ఊహించని స్థాయికి చేరింది. కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. గత ఏడాది పీక్ స్టేజ్ అనుకున్న దాన్ని మించిపోయి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి. ఇక ఎప్పటికీ గత ఏడాది చూసిన కష్ట కాలం రాదనుకుంటే.. మళ్లీ అవే పరిస్థితులు దాదాపు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ పెట్టకపోవచ్చు కానీ.. జనాలు జాగ్రత్త పడకుంటే, స్వీయ నియంత్రణ పాటించకుంటే దారుణాలు చూడక తప్పేట్లు లేదు.
ఈ నేపథ్యంలో త్వరలోనే థియేటర్లపై మళ్లీ ఆంక్షలు తప్పవంటున్నారు. షూటింగ్స్ సజావుగా సాగడమూ కష్టంగానే ఉంది. ప్రభుత్వం ఆదేశించడానికి ముందే పరిశ్రమ పెద్దలు దీని గురించి అంతర్గతంగా చర్చించి షూటింగ్స్ ఆపేయాలని చూస్తున్నారట. ఇప్పటికే కొన్ని పెద్ద చిత్రాల షూటింగ్స్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇలా ఎవరికి వారు షూటింగ్స్ ఆపడం కష్టమని.. కాబట్టి ఇండస్ట్రీ తరఫున ఓ నిర్ణయం తీసుకుని, షూటింగ్స్ ఆపించేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ మేరకు నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు.
This post was last modified on April 17, 2021 1:44 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…