Movie News

చిరు టీం జగన్‌ దగ్గరికి వెళ్తుందా?


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో టికెట్ల ధరలపై నియంత్రణ తీసుకురావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టడానికే ఉన్నట్లుండి అధికార యంత్రాంతం, మంత్రులు టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చారన్నది బహిరంగ రహస్యం.

ఐతే ఈ ఒక్క సినిమా వరకు పట్టుదల ప్రదర్శించి.. తర్వాత వచ్చే సినిమాలకు నియంత్రణ ఎత్తేస్తే ప్రభుత్వంపై విమర్శలు తప్పవు. అందరికీ ఒకే రకమైన నిబంధనలు పాటించక తప్పదు. అదే జరిగితే మున్ముందు రాబోయే రాబోయే పేరున్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు. ఈ స్థితిలో ఇండస్ట్రీ జనాలు ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు పవన్ సినిమా విషయంలో జరుగుతున్న తంతుపై చోద్యం చూస్తున్న వాళ్లందరూ రేప్పొద్దున తమ సినిమాలకు ఇబ్బంది వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సాధ్యమైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ తరఫున ఒక ప్రతినిధుల బృందం.. ఏపీ సీఎం జగన్ వద్దకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్దగా మారిన చిరంజీవినే దీనికి నేతృత్వం వహించే అవకాశముంది.

ఇండస్ట్రీకి ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వ పెద్దలను కలవడానికి చిరు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇంతకుముందు కూడా అమరావతికి వెళ్లి జగన్‌ను కలిసి వచ్చారు చిరు. హైదరాబాద్‌లోనూ రెండు మూడు సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లారు. వచ్చే నెలలోనో ఆ తర్వాతో తన సినిమా ఆచార్య విడుదల కాబోతోంది. వేరే పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. అసలే కరోనా దెబ్బకు అల్లాడిన ఇండస్ట్రీ.. ఇప్పుడు ఏపీ సర్కారు అమలు చేస్తున్న టికెట్ల రేట్లతో మనుగడ సాధించడం కష్టమని, అవే ధరలు కొనసాగితే తమ సినిమాల బిజినెస్‌ లెక్కలే మారిపోతాయని, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల నుంచి ఆందోళన తప్పదని.. అందుకే సాధ్యమైనంత త్వరగా జగన్‌ను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని ఇండస్ట్రీ జనాలు సూచిస్తున్నారని.. త్వరలోనే చిరు బృందం జగన్‌ దగ్గరికి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

This post was last modified on April 14, 2021 3:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

38 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago