అనుకున్నదే అయింది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్తో కాదని తేలిపోయింది. త్రివిక్రమ్ స్థానంలోకి కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్ 30వ సినిమా ‘జనతా గ్యారేజ్’ కాంబినేషన్లో రాబోతున్నట్లు అధికారికంగా స్పష్టమైంది. కొరటాల మిత్రుడైన మిక్కిలేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రధాన పెట్టుబడిదారు ఆయనే కానీ.. ఈ ప్రాజెక్టులో మరో నిర్మాణ భాగస్వామి కూడా ఉన్నారు. ఆయనే ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్.
హారిక హాసిని సంస్థ భాగస్వామ్యంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించాల్సింది. అందులో అతను చిన్న వాటాదారు. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. త్రివిక్రమ్తో పాటు హారిక హాసిని అధితేన చినబాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ప్రధాన పెట్టుబడిదారుగా మిక్కిలినేని సుధాకర్ వచ్చారు కానీ.. కళ్యాణ్ రామ్ స్థానం మాత్రం మారలేదు.
ఇంతకుముందు ‘జై లవకుశ’ సినిమా చేసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్కు మంచి లాభాలు అందించాడు తారక్. అంతటితో ఆగకుండా అన్నయ్యకు మరో సినిమా చేయాలనుకుని త్రివిక్రమ్ చిత్రానికి నిర్మాణ భాగస్వామిని చేశాడు. దర్శకుడు, ప్రధాన నిర్మాత మారినా.. తన 30వ సినిమాలో కళ్యాణ్ రామ్ను అలాగే కొనసాగించాడు తారక్. కాగా త్రివిక్రమ్తో అనుకున్న సినిమాకు కళ్యాణ్ రామ్ ప్రి ప్రొడక్షన్ వర్క్ కోసమని కోటి రూపాయలు ఏఢాది కిందటే ఇచ్చాడట.
ఇప్పుడు ఆ సబ్జెక్ట్ క్యాన్సిల్ అవడంతో కళ్యాణ్ రామ్కు వడ్డీతో సహా హారిక హాసిన సంస్థ నుంచి డబ్బులు ఇప్పించేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ విషయంలో చిన్న గ్యాప్ తలెత్తిందని.. అందువల్ల తారక్తో మళ్లీ త్రివిక్రమ్, చినబాబు సినిమా చేయాలనుకున్నపుడు అందులో కళ్యాణ్ రామ్ జోక్యం ఉండకపోవచ్చని అంటున్నారు. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత తారక్.. త్రివిక్రమ్తో సినిమా చేస్తాడన్నది ప్రస్తుతానికి టాక్.
This post was last modified on April 13, 2021 10:07 am
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…