ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం.. రిలీజ్ ముందు రోజు నుంచే థియేటర్ల మీద రెవెన్యూ అధికారులు దాడులు చేయడం.. అత్యవసరంగా టికెట్ల ధరల విషయమై జీవో ఇవ్వడం.. కోర్టులో ముందు ఎదురు దెబ్బ తగిలినప్పటికీ మళ్లీ పిటిషన్ వేసి మరీ తమ అభీష్టం నెరవేరేలా చేసుకోవడం తెలిసిందే.
ఈ విషయమై మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లు స్పందించి వకీల్ సాబ్ సినిమాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వేరే సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించి, వకీల్ సాబ్కు నిరాకరించడంతో ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
ఐతే పవన్ అన్నయ్య, జనసేన సభ్యుడు అయిన నాగబాబు మాత్రం ఈ విషయమై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ టికెట్ల రేట్ల విషయంలో నెలకొన్న వివాదానికి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్కు రాజకీయంగా ఇంతకంటే పెద్ద బ్యాటిల్స్ ఉన్నాయని.. పవన్ కళ్యాణ్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే వేరే రకంగా చేస్తాడని, కానీ వకీల్ సాబ్ టికెట్ల వ్యవహారం లాంటి చిన్న విషయాలను పట్టించుకోకపోవచ్చని నాగబాబు అభిప్రాయపడ్డారు.
ఇది వైసీపీలో కింది స్థాయి నాయకులు చేస్తున్న పని అని నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఐతే నాగబాబు వ్యాఖ్యలు మెగా అభిమానులు, జనసైనికులు అంతగా రుచించట్లేదు. జగన్కు తెలియకుండా, ఆయన మద్దతు లేకుండా మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకోరని.. దీన్ని ఇంత పెద్ద వివాదం చేయరని వారు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు వ్యాఖ్యల్ని తప్పుబడుతూ వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుండటం గమనార్హం.
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…