లాక్ డౌన్ టైంలో వేరే దారి లేక ఆకాశం నీ హద్దురా, వి, నిశ్శబ్దం లాంటి పేరున్న సినిమాలకు సైతం థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో అది అనివార్యం. ఐతే లాక్ డౌన్ బ్రేక్ తర్వాత దాదాపుగా అన్ని సినిమాలూ నేరుగా పెద్ద తెర మీదే విడులవుతున్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్కు, ఓటీటీ రిలీజ్కు మధ్య అంతరం బాగా తగ్గిపోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
సంక్రాంతికి రిలీజైన విజయ్ సినిమా ‘మాస్టర్’ను రెండు వారాలు తిరక్కుండానే అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడంపై ఎగ్జిబిటర్లు గగ్గోలు పెట్టడం తెలిసిన సంగతే. అంత పెద్ద సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఇక థియేటర్ల వైపు జనం ఎలా వస్తారన్న ప్రశ్న వారి నుంచి వ్యక్తమైంది. థియేటర్లలో బాగా ఆడుతుండగానే ఓటీటీకి సినిమాను ఇచ్చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈ స్థాయి పెద్ద సినిమాలు కాదు కానీ.. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఇలాగే తక్కువ వ్యవధిలో ఓటీటీల్లోకి వచ్చాయి.
ఇప్పుడు మళ్లీ ఓ పెద్ద సినిమా చాలా తక్కువ గ్యాప్లో ఓటీటీలోకి వచ్చేస్తుండటం మళ్లీ పెద్ద చర్చకు తావిచ్చింది. కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్కుమార్ సినిమా గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పునీత్ సినిమా రేంజ్ ఏంటో కన్నడిగులకు బాగా తెలుసు. అంత పెద్ద హీరో సినిమాను థియేటర్లలో రిలీజైన వారానికే అమేజాన్ ప్రైమ్లో రిలీజ్ చేస్తుండటం కన్నడ పరిశ్రమలో చిన్నపాటి కుదుపుకే కారణమైంది.
ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమలో కూడా ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను చేజేతులా చంపేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘యువరత్న’ కన్నడలో మంచి టాకే తెచ్చుకుంది. ఈ చిత్రానికి తొలి వారం భారీ వసూళ్లే వచ్చాయి. ఐతే రెండో వారం ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించేయడం, తెలుగు చిత్రం ‘వకీల్ సాబ్’ ఎఫెక్ట్ గట్టిగా పడేలా ఉండటంతో ఓటీటీ రిలీజ్కు వెళ్లిపోయినట్లున్నారు. ఐతే ‘యువరత్న’ నిర్మాతలు వాళ్ల స్వార్థం వాళ్లు చూసుకున్నా.. ఈ నిర్ణయం ఇండస్ట్రీకి మంచిది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
This post was last modified on April 9, 2021 5:31 pm
ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే.…
థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…
రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండదని చెబుతూ, ప్రభాస్ అభిమానులకు భరోసానిస్తూ, తేడా…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…