అక్కినేని నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. వైల్డ్ డాగ్. ఆఫీసర్, మన్మథుడు-2 లాంటి పెద్ద డిజాస్టర్ల తర్వాత తన కెరీర్ను మళ్లీ గాడిన పెడుతుందని ఆ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు నాగ్. నిజానికి ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నెట్ ఫ్లిక్స్లో నేరుగా రిలీజ్ చేసేందుకు ఎప్పుడో ఒప్పందం కూడా కుదిరింది.
ఐతే సినిమా చాలా బాగా వచ్చిందన్న ధీమాతో ఆ డీల్ క్యాన్సిల్ చేసి మరీ థియేటర్లలోకి వదిలారు. విడుదల ముంగిట బాగా ప్రమోషన్ కూడా చేశారు. నాగ్ అండ్ టీం కోరుకున్నట్లు వైల్డ్ డాగ్కు మంచి టాక్ కూడా వచ్చింది. కానీ ఏం లాభం? ఆ టాక్ వసూళ్ల రూపంలోకి మారలేదు. నాగ్ లాంటి స్టార్ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు వెళ్లలేదు. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
వైల్డ్ డాగ్ విడుదలైన శుక్రవారం రోజు సెలవు. శని, ఆదివారాలు ఎలాగూ వారాంతమే. అయినా సరే.. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా షేర్ రూ.3 కోట్ల మార్కును కూడా టచ్ చేయలేకపోయింది. ఇప్పటిదాకా షేర్ రూ.3.5 కోట్లకు అటు ఇటుగా ఉందంతే. వీకెండ్లోనే ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన వైల్డ్ డాగ్.. సోమవారం నుంచి నామమాత్రంగా నడుస్తోంది. శుక్రవారం వకీల్ సాబ్ వచ్చాక ఈ చిత్రం థియేటర్ల నుంచి లేచిపోవడం ఖాయం. ఈలోపు వచ్చే రెండు రోజుల్లో కూడా ఈ సినిమా పెద్దగా షేర్ రాబడుతుందన్న ఆశల్లేవు.
మెగాస్టార్ చిరంజీవి వచ్చి సినిమాను ప్రమోట్ చేసినా అది పెద్దగా కలిసి రాలేదు. ఫుల్ రన్ షేర్ రూ.4 కోట్లు కూడా దాటేలా లేదు. ఈ చిత్రానికి నాగ్ కెరీర్లోనే అతి తక్కువగా రూ.7 కోట్ల మేర బిజినెస్ అయిందంతే. పాజిటివ్ టాక్ వస్తే రికవరీ పెద్ద కష్టం కాదనుకున్నారు. కానీ చివరికి చూస్తే రూ.3 కోట్ల నష్టం తప్పట్లేదు. అంటే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా సినిమా డిజాస్టర్గానే నిలవబోతోందన్నమాట.
This post was last modified on April 7, 2021 11:09 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…