రాజకీయాలకు టాటా చెప్పేశాక మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా సినిమాలకు అంకితం అయిపోయారు. పాలిటిక్స్లో ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కొంచెం దెబ్బ తినగా.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఆ డ్యామేజ్కు రిపేర్లు చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు మెగాస్టార్. దాసరి మరణానంతరం ఆ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో చిరు.. లాక్డౌన్ టైంలో కరోనా క్రైసిస్ కమిటీ ఏర్పాటు చేసి చేయడంతో పాటు ఎన్నో మంచి పనులు చేశారు.
అలాగే ఇండస్ట్రీలో ఏ సినిమాకైనా సరే.. తన వంతు సాయం అవసరమైతే చేయడానికి చిరు ముందుకొచ్చారు. బిజీ షెడ్యూళ్లలో కూడా వేరే సినిమాల కోసం సమయం కేటాయించారు. ప్రమోషన్ పరంగా చాలామందికి చిరు సాయం చేశారు. ఇప్పుడు తన మిత్రుడైన నాగార్జున కోసం కూడా ఆయన చాలానే చేస్తున్నారు.
నాగ్ కెరీర్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్లో ఉంది. వరుస పరాజయాలు ఆయన మార్కెట్ను బాగా దెబ్బ తీశాయి. ‘వైల్డ్ డాగ్’కు ఆశించిన ప్రి రిలీజ్ బజ్ రాలేదు. ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. మంచి టాక్ వచ్చినా వసూళ్లు లేవు. ఈ నేపథ్యంలో చిరు స్వయంగా ఈ సినిమా చూసి దాని గురించి ప్రత్యేకంగా ట్వీట్ వేశారు. అంతటితో ఆగకుండా చొరవ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించారు.
విడుదల ముంగిట కూడా చిరు.. నాగ్ను తన ఇంటికి పిలిపించుకుని వంట చేసి పెట్టారు. సినిమాకు మరో రకంగా ప్రమోషన్ చేసి పెట్టారు. తాజాగా ప్రెస్ మీట్లో అయితే ‘వైల్డ్ డాగ్’ను ఆకాశానికెత్తేశారు చిరు. తన మిత్రుడి కోసం చిరు.. ఇంతగా తపించడం, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం గొప్ప విషయమే.
మామూలుగా పెద్ద హీరోలు తమ ఫ్యామిలీ హీరోల సినిమాలను ప్రమోట్ చేయడానికే చూస్తారు. మరెవ్వరూ కూడా తోటి హీరో కోసం ఇంతగా తపించరు. మిత్రధర్మం పాటించడంలో చిరు అందరికీ ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీ పెద్ద అనే మాటకు సరైన నిర్వచనం చెబుతున్నారు మెగాస్టార్.
This post was last modified on April 5, 2021 2:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…