Movie News

ఏఎన్నార్ 39 ఏళ్ల నాటి సినిమా.. ఇప్పుడు రిలీజ‌ట‌


కొన్ని సినిమాలు అనివార్య ప‌రిస్థితుల్లో ఆగిపోయి కొన్నేళ్ల త‌ర్వాత రిలీజ‌వుతుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇలా ఆగిపోయిన సినిమాలు అందులోని న‌టీన‌టుల్లో లేదా టెక్నీషియ‌న్ల‌లో ఎవ‌రైనా చ‌నిపోయాక రిలీజ‌వ‌డం కూడా అప్పుడ‌ప్పుడూ జ‌రుగుతుంటుంది. కానీ ఒక సినిమా మొద‌లుపెట్టిన 39 ఏళ్ల‌కు రిలీజ్ కావ‌డం.. అందులో ప్ర‌ధాన పాత్ర పోషించిన నటుడు, ద‌ర్శ‌కుడు చాలా ఏళ్ల కింద‌టే చ‌నిపోవ‌డం మాత్రం అరుదైన విష‌య‌మే. ఇప్పుడు అదే జ‌ర‌గ‌బోతోంది.

టాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన పాత్ర పోషించిన ప్ర‌తిబింబాలు అనే సినిమా.. అది మొద‌లైన 39 ఏళ్ల‌కు విడుద‌ల కాబోతోంద‌ట‌. 1982 సెప్టెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి హీరో హీరోయిన్లుగా ప్రతిబింబాలు చిత్రాన్ని ప్రారంభించారు.

కొన్ని కార‌ణాల వ‌ల్ల చిత్ర నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పుడు ఆగిపోయిన ఈ సినిమాను 39 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విడుదల చేయబోతున్నట్లు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు దాని నిర్మాత జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ‌మూర్తి. ఈ చిత్రాన్ని ఇద్ద‌రు ద‌ర్శ‌కులు రూపొందించ‌డం విశేషం. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి అయిన అప్ప‌టి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాష్ రావుతో పాటు ఇంకొంత భాగాన్ని మరో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్‌ చేశారు.

ప్ర‌కాష్ రావు ఎప్పుడో కాలం చేయ‌గా.. ఏఎన్నార్ సైతం ద‌శాబ్దం కింద‌ట చ‌నిపోయారు. ఈ సినిమాకు ప‌ని చేసిన మ‌రికొంత‌మంది కూడా ఇప్పుడు లేరు. ఐతే ఇంత గ్యాప్ వ‌చ్చాక ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న విడుదల చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. థియేట‌ర్ల‌లో అయితే ఈ సినిమా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల‌ ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌చ్చు. బ‌హుశా ఏదైనా ఓటీటీలో రిలీజ్ చేసి మ‌మ అనిపిస్తారేమో.

This post was last modified on April 3, 2021 7:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

23 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

29 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

60 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago