Movie News

ఏఎన్నార్ 39 ఏళ్ల నాటి సినిమా.. ఇప్పుడు రిలీజ‌ట‌


కొన్ని సినిమాలు అనివార్య ప‌రిస్థితుల్లో ఆగిపోయి కొన్నేళ్ల త‌ర్వాత రిలీజ‌వుతుంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇలా ఆగిపోయిన సినిమాలు అందులోని న‌టీన‌టుల్లో లేదా టెక్నీషియ‌న్ల‌లో ఎవ‌రైనా చ‌నిపోయాక రిలీజ‌వ‌డం కూడా అప్పుడ‌ప్పుడూ జ‌రుగుతుంటుంది. కానీ ఒక సినిమా మొద‌లుపెట్టిన 39 ఏళ్ల‌కు రిలీజ్ కావ‌డం.. అందులో ప్ర‌ధాన పాత్ర పోషించిన నటుడు, ద‌ర్శ‌కుడు చాలా ఏళ్ల కింద‌టే చ‌నిపోవ‌డం మాత్రం అరుదైన విష‌య‌మే. ఇప్పుడు అదే జ‌ర‌గ‌బోతోంది.

టాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన పాత్ర పోషించిన ప్ర‌తిబింబాలు అనే సినిమా.. అది మొద‌లైన 39 ఏళ్ల‌కు విడుద‌ల కాబోతోంద‌ట‌. 1982 సెప్టెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి హీరో హీరోయిన్లుగా ప్రతిబింబాలు చిత్రాన్ని ప్రారంభించారు.

కొన్ని కార‌ణాల వ‌ల్ల చిత్ర నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పుడు ఆగిపోయిన ఈ సినిమాను 39 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విడుదల చేయబోతున్నట్లు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు దాని నిర్మాత జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ‌మూర్తి. ఈ చిత్రాన్ని ఇద్ద‌రు ద‌ర్శ‌కులు రూపొందించ‌డం విశేషం. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి అయిన అప్ప‌టి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాష్ రావుతో పాటు ఇంకొంత భాగాన్ని మరో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్‌ చేశారు.

ప్ర‌కాష్ రావు ఎప్పుడో కాలం చేయ‌గా.. ఏఎన్నార్ సైతం ద‌శాబ్దం కింద‌ట చ‌నిపోయారు. ఈ సినిమాకు ప‌ని చేసిన మ‌రికొంత‌మంది కూడా ఇప్పుడు లేరు. ఐతే ఇంత గ్యాప్ వ‌చ్చాక ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న విడుదల చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. థియేట‌ర్ల‌లో అయితే ఈ సినిమా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల‌ ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌చ్చు. బ‌హుశా ఏదైనా ఓటీటీలో రిలీజ్ చేసి మ‌మ అనిపిస్తారేమో.

This post was last modified on April 3, 2021 7:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

29 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago