కొన్ని సినిమాలు అనివార్య పరిస్థితుల్లో ఆగిపోయి కొన్నేళ్ల తర్వాత రిలీజవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇలా ఆగిపోయిన సినిమాలు అందులోని నటీనటుల్లో లేదా టెక్నీషియన్లలో ఎవరైనా చనిపోయాక రిలీజవడం కూడా అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. కానీ ఒక సినిమా మొదలుపెట్టిన 39 ఏళ్లకు రిలీజ్ కావడం.. అందులో ప్రధాన పాత్ర పోషించిన నటుడు, దర్శకుడు చాలా ఏళ్ల కిందటే చనిపోవడం మాత్రం అరుదైన విషయమే. ఇప్పుడు అదే జరగబోతోంది.
టాలీవుడ్ లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించిన ప్రతిబింబాలు అనే సినిమా.. అది మొదలైన 39 ఏళ్లకు విడుదల కాబోతోందట. 1982 సెప్టెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, తులసి హీరో హీరోయిన్లుగా ప్రతిబింబాలు చిత్రాన్ని ప్రారంభించారు.
కొన్ని కారణాల వల్ల చిత్ర నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పుడు ఆగిపోయిన ఈ సినిమాను 39 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు దాని నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. ఈ చిత్రాన్ని ఇద్దరు దర్శకులు రూపొందించడం విశేషం. రాఘవేంద్రరావు తండ్రి అయిన అప్పటి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాష్ రావుతో పాటు ఇంకొంత భాగాన్ని మరో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు.
ప్రకాష్ రావు ఎప్పుడో కాలం చేయగా.. ఏఎన్నార్ సైతం దశాబ్దం కిందట చనిపోయారు. ఈ సినిమాకు పని చేసిన మరికొంతమంది కూడా ఇప్పుడు లేరు. ఐతే ఇంత గ్యాప్ వచ్చాక ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటన విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. థియేటర్లలో అయితే ఈ సినిమా రిలీజ్ చేయడం వల్ల ప్రయోజనం లేకపోవచ్చు. బహుశా ఏదైనా ఓటీటీలో రిలీజ్ చేసి మమ అనిపిస్తారేమో.
This post was last modified on April 3, 2021 7:02 am
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…
హారర్ అంటే కామెడీతో కిచిడి అయిపోయిన ట్రెండ్ లో నేరుగా ఓటిటిలో రిలీజైన మా ఊరి పొలిమేర జనాన్ని భయపెట్టడంలో…
ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు ఒకే రోజు విడుదలైనా బాక్సాఫీస్ కు తట్టుకునే కెపాసిటీ ఉండేది. ఓటిటి, ఇంటర్ నెట్…
తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ…
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…