‘శివ’ సినిమాతో అక్కినేని నాగార్జున కెరీర్ను గొప్ప మలుపు తిప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఐతే అప్పుడు నాగార్జునకు అతను ఎంతగా ఉపయోగపడ్డాడో.. ఆ తర్వాత అంతకుమించిన నష్టం చేశాడు. కొన్నేళ్ల కిందట వర్మతో కలిసి ‘ఆఫీసర్’ అనే సినిమా చేసి బాక్సాఫీస్ దగ్గర నాగ్ ఎదుర్కొన్న పరాభవం అలాంటిలాంటిది కాదు. ఈ సినిమా చేయడానికి రెండేళ్ల ముందు నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’తో ఏకంగా రూ.50 కోట్ల షేర్ సాధించాడు.
అలాంటిది ‘ఆఫీసర్’ ఫుల్ రన్ షేర్ రూ.కోటి మాత్రమే అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దర్శకుడిగా వర్మ పూర్తిగా పతనం అయిపోయిన దశలో నాగ్ అతణ్ని నమ్మడం చారిత్రక తప్పిదమనే చెప్పాలి. దర్శకుడిగా, అలాగే వ్యక్తిగతంగా వర్మ చుట్టూ ఉన్న నెగెటివిటీ మొత్తం ఈ సినిమాకు అంటుకుంది. సినిమాకు దారుణ పరాభవం ఎదురైంది.
ఈ దెబ్బ నుంచి నాగ్ ఇప్పటికీ కోలుకోలేపోతుండటం గమనార్హం. ‘ఆఫీసర్’ తర్వాత నాగ్ నుంచి వచ్చిన ‘దేవదాస్’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఆ తర్వాత ‘మన్మథుడు-2’కు నెగెటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది. ఒకప్పుడు నాగ్ చిత్రాలు ఫ్లాప్ అయినా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునేవి. కానీ ‘మన్మథుడు-2’కు అదీ కరవైంది. నాని ఉండటం వల్లో ఏమో ‘దేవదాస్’ పరిస్థితి కొంచెం మెరుగు.
ఇప్పుడిక ‘వైల్డ్ డాగ్’ విషయానికి వస్తే.. దీని ట్రైలర్ బాగున్నప్పటికీ సినిమాకు ఆశించిన బజ్ రాలేదు. రిలీజ్ ముందు రోజు బుకింగ్స్ చూస్తే నాగ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తినేసిందో అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఒక్కటంటే ఒక్క షో ఫుల్ కాలేదు. ప్రైమ్ సెంటర్లలో ప్రముఖ థియేటర్లు బుకింగ్స్ లేక వెలవెలబోతున్నాయి. ఇదంతా ఆఫీసర్ తాలూకు ప్రభావం అనడంలో సందేహం లేదు. అప్పుడు దెబ్బ తిన్న మార్కెట్ ఆ తర్వాత పెద్దగా పుంజుకోలేదు. పైగా ‘ఆఫీసర్’ తరహాలోనే ‘వైల్డ్ డాగ్’లోనూ నాగ్ స్పెషల్ ఆఫీసర్ పాత్ర చేస్తుండటం కూడా ప్రేక్షకుల్లో అనాసక్తి కొంచెం కారణం కావచ్చు.
This post was last modified on April 2, 2021 9:26 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…