కోలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు సీనియర్ నటుడు రాధా రవి. ఆయన ఏదైనా వేదిక ఎక్కితే ఏం మాట్లాడతారో అర్థం కాదు. తనపై తనకు నియంత్రణ ఉండదు. అవతలి వాళ్ల మనోభావాల గురించి ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది అనేస్తుంటారు. ముఖ్యంగా మహిళలంటే ఆయనకు చిన్నచూపు అనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. కొన్ని సినిమా వేదికల మీద దారుణమైన వ్యాఖ్యలు చేసి బుక్కయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తిని రాజకీయ పార్టీలు నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో ఆయన డీఎంకే పార్టీలో ఉండగా.. ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ నయనతార మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. దీంతో డీఎంకే పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం రాధారవి అన్నాడీఎంకే-భాజపా కూటమికి మద్దతుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఆయన నయనతారను టార్గెట్ చేసుకున్నారే. సంబంధం లేకుండా ఆమె పేరును తీసుకొచ్చి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను డీఎంకే నుంచి తప్పించడం గురించి రాధారవి మాట్లాడుతూ.. ఆ పార్టీకి నయనతార ఏమవుతుందని ప్రశ్నించారు. ఆమె ఆ పార్టీకి పీఆర్వోనా అని అడిగారు.
గతంలో నయనతార గురించి మాట్లాడినందుకు డీఎంకే పార్టీ నుంచి తనను తప్పించాలని చూశారని.. కానీ వాళ్లు ఆదేశాలు పంపేలోపే తాను ఆ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేశానని చెప్పిన రాధారవి.. నయన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ఒకవేళ ఆమె కనుక ఉదయనిధి స్టాలిన్తో రిలేషన్షిప్లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను?’’ అంటూ అనుచిత వ్యాఖ్య చేశారు. సదరు వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రాధారవి మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలుండగా.. అధికార పార్టీకి రాధారవి వ్యాఖ్యలు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాయి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…