కోలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు సీనియర్ నటుడు రాధా రవి. ఆయన ఏదైనా వేదిక ఎక్కితే ఏం మాట్లాడతారో అర్థం కాదు. తనపై తనకు నియంత్రణ ఉండదు. అవతలి వాళ్ల మనోభావాల గురించి ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది అనేస్తుంటారు. ముఖ్యంగా మహిళలంటే ఆయనకు చిన్నచూపు అనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. కొన్ని సినిమా వేదికల మీద దారుణమైన వ్యాఖ్యలు చేసి బుక్కయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తిని రాజకీయ పార్టీలు నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో ఆయన డీఎంకే పార్టీలో ఉండగా.. ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ నయనతార మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. దీంతో డీఎంకే పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం రాధారవి అన్నాడీఎంకే-భాజపా కూటమికి మద్దతుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఆయన నయనతారను టార్గెట్ చేసుకున్నారే. సంబంధం లేకుండా ఆమె పేరును తీసుకొచ్చి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను డీఎంకే నుంచి తప్పించడం గురించి రాధారవి మాట్లాడుతూ.. ఆ పార్టీకి నయనతార ఏమవుతుందని ప్రశ్నించారు. ఆమె ఆ పార్టీకి పీఆర్వోనా అని అడిగారు.
గతంలో నయనతార గురించి మాట్లాడినందుకు డీఎంకే పార్టీ నుంచి తనను తప్పించాలని చూశారని.. కానీ వాళ్లు ఆదేశాలు పంపేలోపే తాను ఆ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేశానని చెప్పిన రాధారవి.. నయన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ఒకవేళ ఆమె కనుక ఉదయనిధి స్టాలిన్తో రిలేషన్షిప్లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను?’’ అంటూ అనుచిత వ్యాఖ్య చేశారు. సదరు వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రాధారవి మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలుండగా.. అధికార పార్టీకి రాధారవి వ్యాఖ్యలు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాయి.
This post was last modified on April 2, 2021 6:52 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…