కోలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు సీనియర్ నటుడు రాధా రవి. ఆయన ఏదైనా వేదిక ఎక్కితే ఏం మాట్లాడతారో అర్థం కాదు. తనపై తనకు నియంత్రణ ఉండదు. అవతలి వాళ్ల మనోభావాల గురించి ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది అనేస్తుంటారు. ముఖ్యంగా మహిళలంటే ఆయనకు చిన్నచూపు అనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. కొన్ని సినిమా వేదికల మీద దారుణమైన వ్యాఖ్యలు చేసి బుక్కయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తిని రాజకీయ పార్టీలు నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో ఆయన డీఎంకే పార్టీలో ఉండగా.. ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ నయనతార మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. దీంతో డీఎంకే పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం రాధారవి అన్నాడీఎంకే-భాజపా కూటమికి మద్దతుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఆయన నయనతారను టార్గెట్ చేసుకున్నారే. సంబంధం లేకుండా ఆమె పేరును తీసుకొచ్చి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను డీఎంకే నుంచి తప్పించడం గురించి రాధారవి మాట్లాడుతూ.. ఆ పార్టీకి నయనతార ఏమవుతుందని ప్రశ్నించారు. ఆమె ఆ పార్టీకి పీఆర్వోనా అని అడిగారు.
గతంలో నయనతార గురించి మాట్లాడినందుకు డీఎంకే పార్టీ నుంచి తనను తప్పించాలని చూశారని.. కానీ వాళ్లు ఆదేశాలు పంపేలోపే తాను ఆ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేశానని చెప్పిన రాధారవి.. నయన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ఒకవేళ ఆమె కనుక ఉదయనిధి స్టాలిన్తో రిలేషన్షిప్లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను?’’ అంటూ అనుచిత వ్యాఖ్య చేశారు. సదరు వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రాధారవి మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలుండగా.. అధికార పార్టీకి రాధారవి వ్యాఖ్యలు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాయి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…