కోలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు సీనియర్ నటుడు రాధా రవి. ఆయన ఏదైనా వేదిక ఎక్కితే ఏం మాట్లాడతారో అర్థం కాదు. తనపై తనకు నియంత్రణ ఉండదు. అవతలి వాళ్ల మనోభావాల గురించి ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అది అనేస్తుంటారు. ముఖ్యంగా మహిళలంటే ఆయనకు చిన్నచూపు అనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. కొన్ని సినిమా వేదికల మీద దారుణమైన వ్యాఖ్యలు చేసి బుక్కయ్యారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇలాంటి వ్యక్తిని రాజకీయ పార్టీలు నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో ఆయన డీఎంకే పార్టీలో ఉండగా.. ఓ సినిమా వేడుకలో మాట్లాడుతూ నయనతార మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. దీంతో డీఎంకే పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం రాధారవి అన్నాడీఎంకే-భాజపా కూటమికి మద్దతుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మరోసారి ఆయన నయనతారను టార్గెట్ చేసుకున్నారే. సంబంధం లేకుండా ఆమె పేరును తీసుకొచ్చి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను డీఎంకే నుంచి తప్పించడం గురించి రాధారవి మాట్లాడుతూ.. ఆ పార్టీకి నయనతార ఏమవుతుందని ప్రశ్నించారు. ఆమె ఆ పార్టీకి పీఆర్వోనా అని అడిగారు.
గతంలో నయనతార గురించి మాట్లాడినందుకు డీఎంకే పార్టీ నుంచి తనను తప్పించాలని చూశారని.. కానీ వాళ్లు ఆదేశాలు పంపేలోపే తాను ఆ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేశానని చెప్పిన రాధారవి.. నయన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ఒకవేళ ఆమె కనుక ఉదయనిధి స్టాలిన్తో రిలేషన్షిప్లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను?’’ అంటూ అనుచిత వ్యాఖ్య చేశారు. సదరు వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. రాధారవి మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలుండగా.. అధికార పార్టీకి రాధారవి వ్యాఖ్యలు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాయి.
This post was last modified on April 2, 2021 6:52 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…