సంక్రాంతి సమయంలో క్రాక్.. ఫిబ్రవరిలో ఉప్పెన.. మార్చిలో జాతిరత్నాలు.. బాక్సాఫీస్ను ఎలా రూల్ చేశాయో తెలిసిందే. ఈ సినిమాలకు పోటీగా వేరే చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఐతే ఎక్కువ పాజిటివ్ టాక్ వీటికే వచ్చింది. పోటీలో ఉన్న మిగతా చిత్రాలను ఇవి తొక్కి పడేశాయి. రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ను రూల్ చేశాయి. తర్వాతి వారాల్లో వచ్చిన సినిమాలను కూడా వెనక్కి నెట్టాయి.
ఈ మూడు చిత్రాల సరసన చేరుతుందని అంచనా వేసిన సినిమా ‘రంగ్ దే’. గత వారాంతంలో మూడు చిత్రాలు విడుదల కాగా.. అన్నింట్లోకి మంచి టాక్ తెచ్చుకున్నది ‘రంగ్ దే’నే. పైన చెప్పుకున్న సినిమాల్లాగే ఇది వీకెండ్లో వచ్చిన మిగతా సినిమాలను తొక్కేసింది. బాక్సాఫీస్ను రూల్ చేసింది. సోమవారం హోలి సెలవు కూడా కలిసి రావడంతో ‘రంగ్ దే’ రూ.12.5 కోట్ల మేర వరల్డ్ వైడ్ షేర్ రాబట్టగలిగింది.
ఐతే వీకెండ్ వరకు మంచి వసూళ్లు రాబట్టింది కానీ.. ‘రంగ్ దే’ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో జోరు చూపించట్లేదు. మంగళవారం వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు తరహాలో ఇది రిలీజైన తర్వాతి వారాల్లోనూ ఆధిపత్యం చలాయించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. పై సినిమాల స్థాయిలో ఈ చిత్రంలో ప్రేక్షకులను గట్టిగా ఆకర్షించే అంశాలు తక్కువే. ‘
క్రాక్’ మాస్ ప్రేక్షకులకు విందు కాగా.. ‘ఉప్పెన’ మంచి ఫీల్ ఉన్న, హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ కావడంతో యువత బాగా ఆకర్షితులయ్యారు. ‘జాతిరత్నాలు’ హిలేరియస్ మూవీ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్లకు పరుగులు పెట్టారు. ‘రంగ్ దే’ యావరేజ్గా అనిపించే టైంపాస్ మూవీ కావడంతో వీకెండ్ తర్వాత హోల్డ్ చేయడం కష్టమయ్యేలా ఉంది. పైగా ఈ వారం ‘వైల్డ్ డాగ్’, ‘సుల్తాన్’ మంచి అంచనాలతో రిలీజవుతున్నాయి. తర్వాతి వారం ‘వకీల్ సాబ్’ ఉంది. కాబట్టి ‘రంగ్ దే’కు లాంగ్ రన్ డౌటే. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.20 కోట్లకు పైగానే షేర్ రాబట్టాల్సిన ఈ చిత్రం ‘హిట్’ స్టేటస్ అందుకుంటుందా అన్నదీ సందేహమే.
This post was last modified on March 31, 2021 7:54 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…