కరోన-లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు ఎలా అల్లాడిపోయాయో తెలిసిందే. ఈ దెబ్బ నుంచి బాలీవుడ్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. మిగతా ఇండస్ట్రీలు కూడా నత్తనడకనే నడుస్తున్నాయి. కానీ తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఈ దెబ్బ నుంచి త్వరగానే తేరుకుంది. ఈ విరామం తర్వాత థియేటర్లు పునఃప్రారంభం అయిన కొన్ని రోజులకే అవి కళకళలాడాయి.
50 శాతం ఆక్యుపెన్సీతోనే మన సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. ఆక్యుపెన్సీ 100 శాతానికి పెరిగాక పరిస్థితి మరింత మెరుగుపడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా టాలీవుడ్ మళ్లీ కళకళలాడుతోంది. ఇది చూసి మిగతా ఇండస్ట్రీల వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. మన ఇండస్ట్రీని, ప్రేక్షకులను పొగిడేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో కార్తి సైతం తెలుగు సినీ పరిశ్రమ, ఇక్కడి ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించాడు.
తన కొత్త చిత్రం సుల్తాన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన కార్తి.. దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలకూ ఒక హోప్ ఇచ్చిన ఇండస్ట్రీ టాలీవుడ్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తెలుగు సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయని.. అది చూసి తమిళ ఇండస్ట్రీ కూడా ఎంతో సంతోషించిందని కార్తి తెలిపాడు. తన సినిమా రిలీజ్ చేయాలనుకున్నపుడు కూడా.. తెలుగులో మంచి సినిమాలను ఆదరిస్తున్నారన్న ధీమాతో విడుదలకు సిద్ధమైనట్లు చెప్పాడు కార్తి.
ఇక ఊపిరి సినిమాలో తనతో కలిసి నటించిన నాగార్జునతో ఇప్పుడు బాక్పాఫీస్ పోటీకి దిగడంపై కార్తి మాట్లాడుతూ.. దురదృష్ట వశాత్తూ, మరో అవకాశం లేక వైల్డ్ డాగ్కు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయాల్సి వస్తోందన్నాడు. నాగార్జున తన సొంత కుటుంబ సభ్యుడిలాగే అని, ఆయన్ని సోదరుడిగా భావిస్తానని.. వైల్డ్ డాగ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పెద్ద మనసుతో ఆయన తన సినిమా కూడా బాగా ఆడాలని కోరుకున్నాడని.. ఇందుకు ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెబుతానని.. వైల్డ్ డాగ్ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నానని కార్తి అన్నాడు.
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…