టాలీవుడ్ బాక్సాఫీస్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. బయట మంచి మిత్రులైన నితిన్, రానా దగ్గుబాటి బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారు. నితిన్ కొత్త సినిమా ‘రంగ్ దె’, రానా ఏడాది కిందటే పూర్తి చేసి పక్కన పెట్టిన ‘అరణ్య’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టాలీవుడ్ వేసవి వినోదానికి ఈ సినిమాలే శ్రీకారం చుడుతున్నాయి. మున్ముందు వేసవిలో భారీ చిత్రాలు రాబోతున్న నేపథ్యంలో వీటితో శుభారంభం దక్కుతుందని టాలీవుడ్ ఆశిస్తోంది. ప్రతి వారం విడుదలయ్యే అన్ని సినిమాలూ బాగా ఆడాలనే అందరూ కోరుకుంటారు.
కానీ కరోనా బ్రేక్ తర్వాత ఏ వారం కూడా రెండు సినిమాలు బాగా ఆడిన దాఖలాలు లేవు. ఒకటి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మిగతా సినిమాలను దెబ్బ కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలో రంగ్ దె, అరణ్య సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో.. దేన్ని ఏది దెబ్బ కొడుతుందో చూడాలి. రెండూ బాగా ఆడితే అందరికీ సంతోషమే.
ప్రి రిలీజ్ బజ్ ప్రకారం చూస్తే ‘రంగ్ దె’దే స్పష్టమైన పైచేయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైనర్లంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ‘రంగ్ దె’కు మంచి హైపే వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ‘అరణ్య’ సీరియస్ సినిమా కావడంతో పెద్దగా హడావుడి కనిపించడం లేదు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ చాలా చాలా అవసరం. ‘రంగ్ దె’కు ఓ మోస్తరు టాక్ వచ్చినా బాక్సాఫీస్ జర్నీ తేలికైపోతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
ఈ రెంటితో పాటు ఈ వీకెండ్లో మరో ఆసక్తికర చిత్రం విడుదల కాబోతోంది. ‘మత్తు వదలరా’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో అరంగేట్రం చేసిన కీరవాణి చిన్న కొడుకు సింహా నటించిన రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’ పై రెండు చిత్రాలతో డైరెక్ట్ క్లాష్ లేకుండా శనివారం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రోమోలు ఆకట్టుకున్నాయి. మంచి ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించాయి. మరి గట్టి పోటీ మధ్య ఈ చిన్న సినిమా ఏమేర బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2021 11:46 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…