టాలీవుడ్ బాక్సాఫీస్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. బయట మంచి మిత్రులైన నితిన్, రానా దగ్గుబాటి బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారు. నితిన్ కొత్త సినిమా ‘రంగ్ దె’, రానా ఏడాది కిందటే పూర్తి చేసి పక్కన పెట్టిన ‘అరణ్య’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టాలీవుడ్ వేసవి వినోదానికి ఈ సినిమాలే శ్రీకారం చుడుతున్నాయి. మున్ముందు వేసవిలో భారీ చిత్రాలు రాబోతున్న నేపథ్యంలో వీటితో శుభారంభం దక్కుతుందని టాలీవుడ్ ఆశిస్తోంది. ప్రతి వారం విడుదలయ్యే అన్ని సినిమాలూ బాగా ఆడాలనే అందరూ కోరుకుంటారు.
కానీ కరోనా బ్రేక్ తర్వాత ఏ వారం కూడా రెండు సినిమాలు బాగా ఆడిన దాఖలాలు లేవు. ఒకటి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మిగతా సినిమాలను దెబ్బ కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలో రంగ్ దె, అరణ్య సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో.. దేన్ని ఏది దెబ్బ కొడుతుందో చూడాలి. రెండూ బాగా ఆడితే అందరికీ సంతోషమే.
ప్రి రిలీజ్ బజ్ ప్రకారం చూస్తే ‘రంగ్ దె’దే స్పష్టమైన పైచేయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైనర్లంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ‘రంగ్ దె’కు మంచి హైపే వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ‘అరణ్య’ సీరియస్ సినిమా కావడంతో పెద్దగా హడావుడి కనిపించడం లేదు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ చాలా చాలా అవసరం. ‘రంగ్ దె’కు ఓ మోస్తరు టాక్ వచ్చినా బాక్సాఫీస్ జర్నీ తేలికైపోతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
ఈ రెంటితో పాటు ఈ వీకెండ్లో మరో ఆసక్తికర చిత్రం విడుదల కాబోతోంది. ‘మత్తు వదలరా’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో అరంగేట్రం చేసిన కీరవాణి చిన్న కొడుకు సింహా నటించిన రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’ పై రెండు చిత్రాలతో డైరెక్ట్ క్లాష్ లేకుండా శనివారం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రోమోలు ఆకట్టుకున్నాయి. మంచి ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించాయి. మరి గట్టి పోటీ మధ్య ఈ చిన్న సినిమా ఏమేర బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2021 11:46 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…