టాలీవుడ్ బాక్సాఫీస్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. బయట మంచి మిత్రులైన నితిన్, రానా దగ్గుబాటి బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారు. నితిన్ కొత్త సినిమా ‘రంగ్ దె’, రానా ఏడాది కిందటే పూర్తి చేసి పక్కన పెట్టిన ‘అరణ్య’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టాలీవుడ్ వేసవి వినోదానికి ఈ సినిమాలే శ్రీకారం చుడుతున్నాయి. మున్ముందు వేసవిలో భారీ చిత్రాలు రాబోతున్న నేపథ్యంలో వీటితో శుభారంభం దక్కుతుందని టాలీవుడ్ ఆశిస్తోంది. ప్రతి వారం విడుదలయ్యే అన్ని సినిమాలూ బాగా ఆడాలనే అందరూ కోరుకుంటారు.
కానీ కరోనా బ్రేక్ తర్వాత ఏ వారం కూడా రెండు సినిమాలు బాగా ఆడిన దాఖలాలు లేవు. ఒకటి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మిగతా సినిమాలను దెబ్బ కొట్టేస్తోంది. ఈ నేపథ్యంలో రంగ్ దె, అరణ్య సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో.. దేన్ని ఏది దెబ్బ కొడుతుందో చూడాలి. రెండూ బాగా ఆడితే అందరికీ సంతోషమే.
ప్రి రిలీజ్ బజ్ ప్రకారం చూస్తే ‘రంగ్ దె’దే స్పష్టమైన పైచేయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైనర్లంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ‘రంగ్ దె’కు మంచి హైపే వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ‘అరణ్య’ సీరియస్ సినిమా కావడంతో పెద్దగా హడావుడి కనిపించడం లేదు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ చాలా చాలా అవసరం. ‘రంగ్ దె’కు ఓ మోస్తరు టాక్ వచ్చినా బాక్సాఫీస్ జర్నీ తేలికైపోతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
ఈ రెంటితో పాటు ఈ వీకెండ్లో మరో ఆసక్తికర చిత్రం విడుదల కాబోతోంది. ‘మత్తు వదలరా’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో అరంగేట్రం చేసిన కీరవాణి చిన్న కొడుకు సింహా నటించిన రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’ పై రెండు చిత్రాలతో డైరెక్ట్ క్లాష్ లేకుండా శనివారం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రోమోలు ఆకట్టుకున్నాయి. మంచి ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించాయి. మరి గట్టి పోటీ మధ్య ఈ చిన్న సినిమా ఏమేర బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2021 11:46 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…