Movie News

తండ్రి కెరీర్‌ను కాపాడేందుకు కూతుళ్ల కంక‌ణం

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ గరుడ‌వేగ సినిమాతో ఫామ్ అందుకున్న‌ట్లే అందుకుని మ‌ళ్లీ వెనుక‌బ‌డిపోయారు. దాని త‌ర్వాత ఆయ‌న చేసిన క‌ల్కి తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. దీంతో కెరీర్లో మ‌ళ్లీ గ్యాప్ వ‌చ్చేసింది. త‌ర్వాతి సినిమా విష‌యంలో ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గుర‌య్యారు. క‌ప‌ట‌ధారి ఆయ‌న చేయాల్సిన సినిమానే. కానీ అనౌన్స్‌మెంట్ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గారు.

భాయ్ ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్రం చౌద‌రితో ఓ సినిమా అనుకుని దాన్ని కూడా ప‌ట్టాలెక్కించ‌లేదు. నీల‌కంఠ‌తో ఓ సినిమా అన్నారు కానీ.. అది కూడా ముందుకు క‌ద‌ల్లేదు. వ‌రుస‌గా రాజ‌శేఖ‌ర్ సినిమాలు మొద‌లైన‌ట్లే మొద‌లై ఆగిపోతున్నాయేంటి అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొంచెం గ్యాప్‌లో రాజ‌శేఖ‌ర్ మూడు సినిమాల‌ను లైన్లో పెట్ట‌డం, ఆ మూడూ కూడా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తుండ‌టం విశేషం.

మ‌ల‌యాళ హిట్ మూవీ జోసెఫ్‌ను శేఖ‌ర్ పేరుతో రాజ‌శేఖ‌ర్ హీరోగా రీమేక్ సంగ‌తి తెలిసిందే. ల‌లిత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీని ప్రి లుక్ పోస్ట‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపించింది. మ‌రోవైపు కిర‌ణ్ అనే ద‌ర్శ‌కుడితో రాజ‌శేఖర్ హీరోగా మ‌రో కాప్ థ్రిల్ల‌ర్ రెడీ అవుతోంది. దీని అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంది. ఇప్పుడేమో కేరాఫ్ కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హాతో మ‌ర్మాణువు పేరుతో ఒక కొత్త సినిమాను ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు రాజ‌శేఖ‌ర్. ఈ క‌ల‌యిక ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

విశేషం ఏంటంటే రాజ‌శేఖ‌ర్ లైన్లో పెట్టిన ఈ మూడు చిత్రాల్లోనూ నిర్మాత‌లుగా ఆయ‌న కూతుళ్లు శివాని, శివాత్మిక‌ల పేర్లు ప‌డ‌టం విశేషం. వీళ్లిద్ద‌రూ వేరే నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి ఈ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇంత‌కుముందు రాజ‌శేఖ‌ర్ ఏ సినిమా ప‌డితే అది చేసి క్రేజ్ పోగొట్టుకున్నారు. ఐతే ఈ త‌రానికి త‌గ్గ‌ట్లు ఆలోచించే కూతుళ్లు తండ్రి కెరీర్‌ను పైకి లేప‌డానికి కంక‌ణం క‌ట్టుకుని ఆస‌క్తిక‌ర ప్రాజెక్టులను లైన్లో పెట్ట‌డం టాలీవుడ్లో చ‌ర్చనీయాంశంగా మారింది.

This post was last modified on March 26, 2021 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

19 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

2 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago