నటీనటులు, టెక్నీషియన్లకే కాదు.. తెరమీద కనిపించే కార్టూన్ క్యారెక్టర్లకు, జంతువులకు కూడా అభిమానులంటారు. కుంగ్ఫూ పండా, కింగ్ కాంగ్ లాంటి పాత్రలను అమితంగా ఇష్టపడే అభిమానులు కోకొల్లలు. ఐతే ఈ పాత్రల్ని పెట్టి తీసిన సినిమాలు వస్తే థియేటర్లకు వెళ్లి చూడ్డం వరకు ఓకే కానీ.. వాటికి ఫ్యాన్స్ అసోసియేషన్లు అంటేనే వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది.
ఐతే ఊరికే జనాల దృష్టిని ఆకర్షించడానికే చేశారో ఏమో కానీ.. విజయవాడలో ఇలాంటి సంఘమే ఒకటి ఏర్పాటు చేసి, ఒక పోస్టర్ వదలడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ భారీ స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా ఈ సినిమా పెద్ద ఎత్తునే రిలీజైంది. తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపు కాదు.
ఈ నేపథ్యంలో విజయవాడలో ఈ సినిమా ఆడుతున్న థియేటర్ దగ్గర ఒక ఆసక్తికర పోస్టర్ వెలసింది. కింగ్ కాంగ్ యూత్ ఫోర్స్, అఖిల భారత తెలుగు కింగ్ కాంగ్ యువత-విజయవాడ అంటూ పోస్టర్ మీద వేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు ఫ్లెక్సీల మీద రాసినట్లే దీని మీద కూడా వ్యాఖ్యానం ఉంది. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ చిత్రం విడుదల సందర్భంగా విచ్చేయుచున్న మా అభిమాన జంతువు కింగ్ కాంగ్ అభిమానులకు, థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాల్లో రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
వరల్డ్ వైడ్ కింగ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఛైర్మన్, కాంగ్ డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ కొందరి పేర్లు కూడా వేసుకున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొందరు టాలీవుడ్ జనాలు కూడా దీనిపై సరదాగా స్పందించారు. గాడ్జిల్లా వెర్సస్ కాంగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా మంచి స్పందనే వస్తోంది.
This post was last modified on March 26, 2021 8:56 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…