కరోనా విరామం తర్వాత తెలుగు సినిమాల జోరెలా ఉందో తెలిసిందే. థియేటర్ల పున:ప్రారంభంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఒకసారి థియేటర్లు మొదలై కొత్త సినిమాలు రావడం మొదలయ్యాక కలెక్షన్లకు ఢోకా లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సంక్రాంతి సినిమాలు వసూళ్ల పంట పండించుకున్నాయి. ఇక 100 శాతం ఆక్యుపెన్సీకి పెరిగాక పూర్తిగా మునుపటి జోరును అందుకున్నాయి థియేటర్లు. కంటెంట్ ఉన్న సినిమాలకు వసూళ్ల మోత మోగుతోంది. కానీ దేశంలో మిగతా ఇండస్ట్రీల్లో ఈ పరిస్థితి లేదు.
దక్షిణాదిన వేరే ఇండస్ట్రీల్లో అయినా కొంచెం పర్వాలేదు కానీ.. హిందీ సినిమా మార్కెట్ మాత్రం పుంజుకోవట్లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతుండటం, థియేటర్లపై ఆంక్షలు ఎత్తేయకపోవడం, జనాలు థియేటర్లకు రావడానికి అంతగా ఆసక్తి చూపించకపోవడంతో అక్కడ సినిమాలకు గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి.
లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ధైర్యం చేసి రిలీజ్ చేసిన ఏ సినిమా కూడా మంచి ఫలితాన్నందుకోలేదు. ఇందు కీ జవానీ, షకీలా, మేడమ్ ప్రైమ్ మినిస్టర్, రూహి లాంటి చిత్రాలకు దారుణమైన ఫలితాలు దక్కాయి. దీని బదులు ఈ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే కాస్త మెరుగైన రేటు దక్కేదని నిర్మాతలు చింతించే ఫలితాలు వచ్చాయి బాక్సాఫీస్ దగ్గర. ఈ అనుభవాల తర్వాత కూడా ఓ భారీ చిత్రాన్ని థియేటర్లలోకే దించారు. ఆ సినిమానే.. ముంబయి సెగా. ఈ సినిమాతో కథ మారుతుందని ఆశించారు. కానీ ఆ సినిమా కూడా కరోనా కాటుకు బలైపోయింది.
జాన్ అబ్రహాం యాక్షన్ సినిమాతో వస్తే తొలి రోజు దేశవ్యాప్తంగా పది కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ వస్తుంది మామూలుగా. అతడి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వసూళ్లు రూ.30 కోట్లకు అటు ఇటుగా ఉంటాయి. అలాంటిది ‘ముంబయి సెగా’కు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు రూ.10 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతుండటం, థియేటర్లపై ఆంక్షలు, జనాల అనాసక్తి వల్ల ఈ సినిమాకు వసూళ్లు మరీ తక్కువగా వచ్చాయి. కంటెంట్ పరంగా హిట్టవ్వాల్సిన సినిమా కాస్తా.. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కోణంలో చూస్తే డిజాస్టరే అయింది. ఈ సినిమా పరిస్థితి చూశాకే రానా సినిమా ‘అరణ్య’ హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’ రిలీజ్ను ఆపేసింది ఈరోస్ సంస్థ.
This post was last modified on March 24, 2021 1:41 pm
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…