కరోనా విరామం తర్వాత తెలుగు సినిమాల జోరెలా ఉందో తెలిసిందే. థియేటర్ల పున:ప్రారంభంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఒకసారి థియేటర్లు మొదలై కొత్త సినిమాలు రావడం మొదలయ్యాక కలెక్షన్లకు ఢోకా లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సంక్రాంతి సినిమాలు వసూళ్ల పంట పండించుకున్నాయి. ఇక 100 శాతం ఆక్యుపెన్సీకి పెరిగాక పూర్తిగా మునుపటి జోరును అందుకున్నాయి థియేటర్లు. కంటెంట్ ఉన్న సినిమాలకు వసూళ్ల మోత మోగుతోంది. కానీ దేశంలో మిగతా ఇండస్ట్రీల్లో ఈ పరిస్థితి లేదు.
దక్షిణాదిన వేరే ఇండస్ట్రీల్లో అయినా కొంచెం పర్వాలేదు కానీ.. హిందీ సినిమా మార్కెట్ మాత్రం పుంజుకోవట్లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతుండటం, థియేటర్లపై ఆంక్షలు ఎత్తేయకపోవడం, జనాలు థియేటర్లకు రావడానికి అంతగా ఆసక్తి చూపించకపోవడంతో అక్కడ సినిమాలకు గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి.
లాక్ డౌన్ బ్రేక్ తర్వాత ధైర్యం చేసి రిలీజ్ చేసిన ఏ సినిమా కూడా మంచి ఫలితాన్నందుకోలేదు. ఇందు కీ జవానీ, షకీలా, మేడమ్ ప్రైమ్ మినిస్టర్, రూహి లాంటి చిత్రాలకు దారుణమైన ఫలితాలు దక్కాయి. దీని బదులు ఈ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే కాస్త మెరుగైన రేటు దక్కేదని నిర్మాతలు చింతించే ఫలితాలు వచ్చాయి బాక్సాఫీస్ దగ్గర. ఈ అనుభవాల తర్వాత కూడా ఓ భారీ చిత్రాన్ని థియేటర్లలోకే దించారు. ఆ సినిమానే.. ముంబయి సెగా. ఈ సినిమాతో కథ మారుతుందని ఆశించారు. కానీ ఆ సినిమా కూడా కరోనా కాటుకు బలైపోయింది.
జాన్ అబ్రహాం యాక్షన్ సినిమాతో వస్తే తొలి రోజు దేశవ్యాప్తంగా పది కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ వస్తుంది మామూలుగా. అతడి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వసూళ్లు రూ.30 కోట్లకు అటు ఇటుగా ఉంటాయి. అలాంటిది ‘ముంబయి సెగా’కు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు రూ.10 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతుండటం, థియేటర్లపై ఆంక్షలు, జనాల అనాసక్తి వల్ల ఈ సినిమాకు వసూళ్లు మరీ తక్కువగా వచ్చాయి. కంటెంట్ పరంగా హిట్టవ్వాల్సిన సినిమా కాస్తా.. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కోణంలో చూస్తే డిజాస్టరే అయింది. ఈ సినిమా పరిస్థితి చూశాకే రానా సినిమా ‘అరణ్య’ హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’ రిలీజ్ను ఆపేసింది ఈరోస్ సంస్థ.
This post was last modified on March 24, 2021 1:41 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…