ఆది సాయికుమార్.. పుష్కర కాలం నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న యువ కథానాయకుడు. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఒక స్థాయి అందుకున్న సాయికుమార్ వారసత్వం ఉండటం వల్ల ఈ కుర్రాడికి అవకాశాలకైతే లోటు లేదు. కానీ సినిమాల ఎంపికలో చేస్తున్న పొరబాట్ల వల్ల ఆది కెరీర్ ఎంతకీ ఊపందుకోవట్లేదు. నిజంగా చెప్పాలంటే ఆది కెరీర్లో ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. సామాన్య జనాలైతే వాటిని హిట్లుగా పరిగణించరు.
ఐతే అవి ఆది కెరీర్కు పర్వాలేదనిపించే ఆరంభాన్నే ఇచ్చాయి. ఆ తర్వాత ఇంకాస్త పెద్ద విజయాలందుకుని హీరోగా నిలదొక్కుకుంటాడనుకుంటే.. అతడి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఇప్పటికీ ప్రేమకావాలి, లవ్లీ సినిమాల గురించి చెప్పుకుని తన కొత్త చిత్రాలను ప్రమోట్ చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు.
లవ్లీ తర్వాత ఆది వరుసగా 11 ఫ్లాపులు ఎదుర్కోవడం గమనార్హం. ఇన్ని ఫ్లాపుల తర్వాత కూడా ఒక హీరోకు అవకాశాలు వస్తున్నాయంటే విశేషమే. అది సాయికుమార్కు ఇండస్ట్రీలో ఉన్న మంచి పేరు వల్లే. తాజాగా ఆది ‘శశి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకే ఒక లోకం నువ్వే పాట పుణ్యమా అని ఆది గత సినిమాలతో పోలిస్తే దీనికి ఓ మోస్తరుగా బజ్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాపై ఓ లుక్కేద్దామనుకున్నారు. కానీ సినిమా కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఈ వారం వచ్చిన మిగతా రెండు సినిమాల కంటే ఏమాత్రం మెరుగ్గా ఉన్నా ‘శశి’ని ప్రేక్షకులు ఆదరించేవారేమో. కానీ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చూసిన వాళ్లందరూ ‘శశి’ గురించి పూర్తిగా నెగెటివ్గానే మాట్లాడుతున్నారు. రివ్యూలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో మినిమం ఆక్యుపెన్సీ లేకపోయింది ఈ చిత్రానికి. వరుసగా పన్నెండో ఫ్లాప్ ఆది ఖాతాలో పడిపోయింది. ఈ స్థితి నుంచి ఇక ఆది కోలుకోవడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on March 22, 2021 6:11 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…