Movie News

సుకుమార్ మాస్టర్ స్ట్రోక్

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. అల్లు అర్జున్-సుకుమార్‌ల కొత్త సినిమా ‘పుష్ప’లో విలన్ ఎవరో తేలిపోయింది. దాదాపు ఏడాది చర్చ తర్వాత ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరనే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు సుకుమార్. మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఆ పాత్రకు ఓకే చేశాడు సుక్కు. మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవలే సుకుమార్ కేరళకు వెళ్లి నేరుగా ఫాహద్‌ను కలిసి కథ, తన పాత్ర గురించి చెప్పి ఈ సినిమాకు ఒప్పించాడు.

మంచి విషయం ఉన్న పాత్ర కావడం.. అలాగే తమ రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉన్న బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకునే రావడం.. అలాగే తెలుగులో అడుగు పెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి రాదన్న ఉద్దేశంతో ఫాహద్ ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ముందు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకున్నాడు సుక్కు. మొదట అతను ఓకే అన్నాడు కానీ, తర్వాత డేట్లు సర్దుబాటు చేయలేకో మరో కారణంతోనో ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. తర్వాత బాబీ సింహా, అరవింద్ స్వామి, బాబీ డియోల్.. ఇలా ఈ పాత్రకు రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వాళ్లెవ్వరూ కాకుండా చివరికి ఫాహద్‌ను ఈ పాత్రకు ఓకే చేశాడు సుక్కు. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ.. సరైన నటుడినే ‘పుష్ప’ విలన్ పాత్రకు ఎంపిక చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫాహద్ ఫాజిల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఈ మధ్య తెలుగులో అనువాదమై ఆహాలో విడుదలైన ‘ట్రాన్స్’ సినిమా చూస్తే అతడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ‘తొండిముదలుమ్ దృక్సక్షియుం’, ‘కుంబలంగి నైట్స్’ లాంటి సినిమాల్లో అతడి నటన చూసి ఫిదా అవ్వకుండా ఉండలేం. అతను జాతీయ అవార్డుతో పాటు మరెన్నో పురస్కారాలు అందుకున్నాడు. చూడ్డానికి మామూలుగా కనిపిస్తాడు కానీ.. కేవలం కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించగలడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అతను ఇంకా గొప్పగా నటిస్తాడు.

‘పుష్ప’లో అతడి పాత్ర చాలా ప్రత్యేకంగానే ఉంటుందంటున్నారు. సుకుమార్ సినిమాలో బన్నీ ముందు ఇలాంటి నటుడుంటే.. కన్‌ఫ్రంటేషన్ సీన్లు భలేగా పండే అవకాశముంది. ఫాహద్ ఈ ప్రాజెక్టులోకి రావడంతో కేరళ, తమిళనాడుల్లో భారీగా రిలీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మొత్తానికి సుకుమార్ ఫాహద్‌ను ఎంపిక చేయడం మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి.

This post was last modified on March 21, 2021 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారం కూటమి వద్ద.. జనం జగన్ వద్ద: పేర్ని నాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…

7 minutes ago

పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ ఫైరింగ్ చూశారా?

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…

28 minutes ago

వాస్త‌వానికి.. మంగ‌ళ‌గిరిలో పోటీ చేయాల‌ని లేదు: నారా లోకేష్‌

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ .. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా…

37 minutes ago

భారతీయులకు ఇలా జరగాల్సిందే… రాణా కామెంట్స్ వైరల్

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా భారతదేశానికి అప్పగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో అరెస్టై…

37 minutes ago

ఒంటిమిట్ట రాములోరికి 7 కిలోల బంగారు కిరీటాలు

ఏపీలోని అన్నమయ్య జిల్లా వెలసిన ఒంటమిట్ల రాములోరికి శుక్రవారం భారీ బంగారు కిరీటాలు విరాళంగా అందాయి. రాములోరితో పాటుగా సీతమ్మ…

45 minutes ago

మాది బీసీల పార్టీ: చంద్ర‌బాబు

"మాది బీసీ ప‌క్ష‌పాత పార్టీ. ఇంకా చెప్పాలంటే.. బీసీల పార్టీ" అని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు వ్యా ఖ్యానించారు.…

2 hours ago