టాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్కు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మాస్ రాజా రవితేజతో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి జత కట్టే అవశాలున్నాయి. వీరి కలయికలో ఒక ఆసక్తికర సినిమా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మలయాళంలో విజయవంతం అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రాన్ని రవితేజ-సేతుపతి కలయికలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారట.
ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన సినిమా స్టార్ పాత్రలో రవితేజ నటించనుండగా.. సూరజ్ చేసిన ఆర్టీవో ఇన్స్పెక్టర్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ హక్కులు కొన్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని.. అతనే ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు. ఈ కాంబినేషన్ నిజమే అయితే.. ఈ ప్రాజెక్టుకు అనూహ్యమైన క్రేజ్ రావడం ఖాయం.
మాస్టర్, ఉప్పెన సినిమాలతో సేతుపతికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అతడి కోసమే సినిమాలకు వచ్చే అభిమానులు పెద్ద ఎత్తున తయారయ్యారు. ఇక మాస్ రాజా సినిమాలో అతడికి దీటుగా ఉండే పాత్రలో సేతుపతి కనిపిస్తే ఈ ప్రాజెక్టుకు వచ్చే క్రేజే వేరు. ‘డ్రైవింగ్ లైసెన్స్’ మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రం. గత ఏడాది హఠాత్తుగా మరణించిన ‘అయ్యప్పనుం కోషీయుం’ దర్శకుడు సాచీ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే రాశాడు. ఆయన బెస్ట్ వర్క్స్లో ఒకటిగా ‘డ్రైవింగ్ లైసెన్స్’ పేరు తెచ్చుకుంది.
మోటార్ కార్ రేసింగ్ నేపథ్యంలో సాగే సినిమాలో నటించడం కోసం స్టార్ హీరో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం తన వీరాభిమాని అయిన ఆర్టీవో ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తాడు. కానీ అక్కడ అతడిని అవమానించేలా వ్యవహరిస్తాడు. దీంతో తన అభిమాన కథానాయకుడికి ఎదురు తిరిగి అతడికి లైసెన్స్ ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాగే పోరు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.
This post was last modified on March 18, 2021 3:41 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…