Movie News

మోస‌గాళ్లు ర‌చ‌యిత‌లు ఎవ‌రు?

మంచు విష్ణు నుంచి కొంత విరామం త‌ర్వాత వ‌స్తున్న సినిమా మోస‌గాళ్ళు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది ఇండియ‌న్ కాదు. హాలీవుడ్ నుంచి జెఫ్రీ చిన్ అనే ద‌ర్శ‌కుడిని తీసుకొచ్చాడు విష్ణు. అత‌ను ఇంత‌కుముందు ఒక షార్ట్ ఫిలిం మాత్ర‌మే డైరెక్ట్ చేశాడు. ఫీచ‌ర్ ఫిలిం తీసిన అనుభ‌వ‌మేమీ లేదు. ఇక ఈ సినిమా క‌థ అంతా ఇండియా నేప‌థ్యంలో న‌డిచేది. ఇక్క‌డి విష‌యాల‌పై ద‌ర్శ‌కుడికేమీ అవ‌గాహ‌న లేన‌ట్లే. స్క్రిప్టులో కూడా అత‌ను భాగం కాదు. స్క్రిప్టు చేతికిస్తే దాన్ని డైరెక్ట్ చేసి పెట్టాడు.

మ‌రి ఈ చిత్రానికి స్క్రిప్టు రాసింది ఎవ‌రు అన్న సందేహం రావ‌డం స‌హ‌జం. ఆ బాధ్య‌త స్వ‌యంగా మంచు విష్ణునే తీసుకున్నాడు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఐటీ స్కాం గురించి తెలుసుకున్న అత‌ను.. దానిపై స్వ‌యంగా స్క్రిప్టు రాశాడ‌ట‌. ఫ‌స్ట్ డ్రాఫ్ట్ అయ్యాక మంచు కుటుంబానికి సన్నిహితుడైన‌ డైమండ్ ర‌త్న‌బాబు స‌హ‌కారం తీసుకున్నాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి మోస‌గాళ్ళు స్క్రిప్టును ప‌క‌డ్బందీగా తీర్చిదిద్దారు. త‌ర్వాత ఇంగ్లిష్‌లో దీనికి డ్రాఫ్ట్ త‌యారు చేయించారు. ఆపై స్క్రిప్టును ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టారు.

విష్ణు ఇంత‌కుముందు కూడా దేనికైనా రెడీ స‌హా త‌న సినిమాలు కొన్నింట్లో క‌థా చ‌ర్చ‌ల్లో కీల‌కంగా ఉన్నాడు. కానీ తొలిసారి ర‌చ‌యిత‌గా అత‌డి పేరు మోస‌గాళ్ళు సినిమాకే ప‌డ‌నుంది. అంటే త‌న కెరీర్‌ను గాడిన పెట్టుకోవ‌డానికి స్వ‌యంగా విష్ణునే ర‌చ‌యిత‌గా మారాడ‌న్న‌మాట‌. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఏమేర ఫ‌లితాన్నందిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో కాజ‌ల్‌.. విష్ణుకు సోద‌రిగా న‌టించ‌డం విశేషం. సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ నెల 19న మోస‌గాళ్ళు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

This post was last modified on March 18, 2021 11:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago