టాలీవుడ్లో వివాద రహిత టెక్నీషియన్గా మణిశర్మకు మంచి పేరుంది. ఆయన ఎప్పుడూ పెద్దగా వివాదాల్లో జోక్యం చేసుకున్నట్లు వార్తలు రాలేదు. సైలెంటుగా తన పని తాను చేసుకుపోతుంటాడు. కాకపోతే దర్శకులతో మ్యూజిక్ డైరెక్టర్లకు క్రియేటివ్ డిఫరెన్సెస్ మామూలే. అలాంటి విద్వత్తున్న సంగీత దర్శకుడికి కొన్నిసార్లు.. దర్శకులతో వేవ్ లెంగ్త్ కుదరక చిన్న చిన్న గొడవలు జరిగి ఉండొచ్చు. కానీ అవేవీ బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మణిశర్మకు ఓ దర్శకుడితో వివాదం తలెత్తి ఆ ప్రాజెక్టు నుంచే బయటికి వచ్చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాగా.. వీళ్లిద్దరి మధ్య విభేదాలకు కారణమైన సినిమా నారప్ప అట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నారప్ప సినిమాకు సంగీతం అందించే విషయంలో తనకు స్వేచ్ఛ ఇవ్వడం లేదంటూ మణిశర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో హల్చల్ చేసింది. కానీ ఇటీవల శ్రీకాంత్తో మణిశర్మకు విభేదాలు తీవ్రమయ్యాయని.. ఆయన ఈ ప్రాజెక్టు నుంచి వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో రూమర్లు కూడా వినిపిస్తున్నాయి.
కానీ ఇంకా పక్కాగా సమాచారం అయితే బయటికి రాలేదు. ఇలాంటి పేరున్న సినిమా నుంచి ఈ దశలో సంగీత దర్శకుడు బయటికి వచ్చేస్తే ఇది ఇరు వర్గాలకూ మంచిది కాదు. మళ్లీ టాప్ ఫామ్ అందుకుని వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్న దశలో మణిశర్మకు ఇది చెడే చేస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్ తీస్తున్న సినిమా నుంచి సంగీత దర్శకుడు బయటికి వెళ్లిపోతే వారికీ ఇబ్బందికరమే. కాబట్టి ఇరు వర్గాలూ సర్దుకుని మణిశర్మ ఈ సినిమాలో కొనసాగేలా చూస్తే మంచిదేమో.
This post was last modified on March 17, 2021 11:29 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…