పుట్టిన రోజు నాడు చాలామంది కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి ఏదైనా మంచి అలవాటు మొదలుపెట్టాలని.. లేదంటే ఏదైనా చెడు అలవాటును విడిచిపెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఐతే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మాత్రం ఆశ్చర్యకరంగా సోషల్ మీడియాను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
సోషల్ మీడియా అనేది కొందరికి ఒక వ్యసనం. దానికి దూరంగా ఉండలేని బలహీనత ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాకు దూరమయ్యే వాళ్లూ ఉంటారు. కానీ ఆమిర్ అలా ఏమీ కాదు. ఆయన ట్విట్టర్లో కానీ, ఇతర సోషల్ మీడియాల్లో కానీ ఏమంత యాక్టివ్గా ఉండరు. తన సినిమాలు, ఇతర విషయాల గురించి ఎప్పుడో ఒక అప్డేట్ మాత్రమే ఇస్తుంటాడు. ఐతే సోమవారం ఆమిర్ పుట్టిన రోజు కాగా.. తనకు శుభాకాంక్షలు చెప్పిన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పి సోషల్ మీడియాకు టాటా చెప్పేశాడు ఆమిర్.
తాను సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఏమీ ఉండననే విషయాన్ని కొంచెం వ్యంగ్యంగా చెప్పి.. తాను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించాడు. ఐతే అభిమానులు నిరాశ చెందకుండా తన సినిమాలకు సంబంధించి, ఇతర విషయాల గురించి అప్డేట్స్ ఇవ్వడానికి తన నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఉందని.. దాన్నుంచే ఇకపై తనకు సంబంధించి అధికారిక సమాచారాలు అందిస్తామని ఆమిర్ వెల్లడించాడు.
ఆమిర్ అలా అన్నప్పటికీ అతను సోషల్ మీడియాను వదిలి వెళ్లిపోవడం అభిమానులకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరీనా కపూర్ ఇందులో కథానాయిక. మన నాగచైతన్య ఇందులో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on March 15, 2021 6:40 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…